అక్రమాలకు పాల్పడిన వారు బీజేపీలో చేరగానే శుద్ధులైపోతారా..!: రామకృష్ణ
ABN, Publish Date - Mar 27 , 2024 | 02:28 AM
భారీస్థాయిలో అవినీతి, అక్రమాలకు పాల్పడినవారు బీజేపీలో చేరగానే శుద్ధులైపోతారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ప్రశ్నించారు.
అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): భారీస్థాయిలో అవినీతి, అక్రమాలకు పాల్పడినవారు బీజేపీలో చేరగానే శుద్ధులైపోతారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ప్రశ్నించారు. ‘బీజేపీ ప్రభుత్వం లిక్కర్ స్కాం పేరుతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను జైలుకు పంపింది. భారీ మైనింగ్ అక్రమాలకు పాల్పడి, జైలుకెళ్లి, ఇప్పటికీ కేసులు ఎదుర్కొంటున్న గాలి జనార్దనరెడ్డిని తమ పార్టీలో చేర్చుకుంటోంది. మద్యం అమ్మకాల్లో రూ.వేల కోట్ల అక్రమాలకు పాల్పడిన సీఎం జగన్పై చర్యలు తీసుకోవాలని సాక్షాత్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కేంద్ర హోం మంత్రికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. ఇవేనా బీజేపీ చెబుతున్న నీతి రాజకీయాలు?’ అని రామకృష్ణ నిలదీశారు.
Updated Date - Mar 27 , 2024 | 08:52 AM