ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చంద్రబాబుతోనే రాషా్ట్రభివృద్ధి.. సంక్షేమం

ABN, Publish Date - Apr 06 , 2024 | 11:26 PM

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతోనే రాషా్ట్రభివృద్ధి, సంక్షేమం సాధ్యమని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి దాసరిపల్లి జయ చంద్రారెడ్డి పేర్కొన్నారు.

ఏడుమడకలపల్లెలో గ్రామస్ధులతో ఉమ్మడి అభ్యర్ధి జయచంద్రారెడ్డి

ఏప్రిల్‌ నుంచి అవ్వాతాతలకు రూ.4వేలు పెన్షన

తంబళ్లపల్లె ఉమ్మడి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి

ములకలచెరువు, ఏప్రిల్‌ 6: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతోనే రాషా్ట్రభివృద్ధి, సంక్షేమం సాధ్యమని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి దాసరిపల్లి జయ చంద్రారెడ్డి పేర్కొన్నారు. మండలం లోని కోనేటివారిపల్లె పంచాయతీ ఏ సువారిపల్లె, కోనేటివారిపల్లె, ఏడుమ డకలపల్లె, రాయపువారిపల్లె, రామా కులపల్లె, తంబళ్లవారిపల్లె, సోంపాళ్యం తదితర గ్రామాల్లో బాబు ష్యూరిటీ .. భవిష్యత్తు గ్యారంటీ పథకాలు, విజయ సంకల్ప ప్రచార యాత్రలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే ఏప్రిల్‌ నెల నుంచే పెన్షన లబ్ధిదారులకు రూ.4వేలు పెన్షనను నేరుగా ఇంటి వద్దకే వచ్చి అందిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారన్నారు. ఒక్క అవకాశమిస్తే తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపి స్తానన్నారు. కార్యక్రమాల్లో టీడీపీ మండల అధ్యక్షుడు పాలగిరి సిద్ధా, జనసేన ఇనచార్జి పోతుల సాయినాధ్‌, మాజీ జడ్పీటీసీ సభ్యుడు కువైట్‌ శంకర్‌, నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షుడు చెన్నకిష్టా, మాజీ సర్పంచ యర్రగుడి సురేష్‌, నేతలు కేవీ రమణ, నాయ కులు ఉమాశంకర్‌, ప్రతాప్‌, రమణారెడ్డి, పాలరాము, వెంకటసిద్ధయ్య, శివన్న, మెకానిక్‌ హరి, సోమశేఖర్‌, శివ, ఆంజనేయరెడ్డి, రంగాళ్ళ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 11:26 PM

Advertising
Advertising