ఎస్ఐను సన్మానించిన వైసీపీ నేత
ABN, Publish Date - Mar 22 , 2024 | 03:40 AM
బాపట్ల జిల్లా బల్లికురవ ఎస్ఐ శివనాగిరెడ్డి వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం పోలీ్సస్టేషన్లోనే వైసీపీ నేతనుంచి ఎస్ఐ సత్కారం అందుకున్నారు.
విమర్శలు రావడంతో ఆ ఫొటో ఇప్పటిది కాదంటున్న వైనం
బాపట్ల, మార్చి 21(ఆంధ్రజ్యోతి): బాపట్ల జిల్లా బల్లికురవ ఎస్ఐ శివనాగిరెడ్డి వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం పోలీ్సస్టేషన్లోనే వైసీపీ నేతనుంచి ఎస్ఐ సత్కారం అందుకున్నారు. కొమ్మినేని వారిపాలేనికి చెందిన వైసీపీ నేత పూరేటి వెంకటనారాయణ ఎస్ఐను శాలువాతో సన్మానించడం విమర్శలకు తావిస్తోంది. ఎస్ఐను సన్మానిస్తున్న ఫొటోలు వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీంతో ఆ ఫొటోలు ఇప్పుడు దిగినవి కావని, ఫిబ్రవరిలోవని సదరు నేత చెబుతున్నారు. మరోవైపు మద్యం అమ్మకాలు సాగిస్తున్నాడంటూ టీడీపీ సానుభూతిపరుడైన శానంపూడి హనుమంతరావు అనే వృద్ధుడిపై ఎస్ఐ చేయి చేసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఎస్ఐ దాడితో అనారోగ్యానికి గురై ఒంగోలు రిమ్స్లో చికిత్స పొందుతున్న వృద్ధుడు ఎస్ఐపై గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Updated Date - Mar 22 , 2024 | 03:40 AM