ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YV Subbareddy: ముద్రగడ జనసేనలో చేరడంపై తెలియదు.. అవగాహన లేదు

ABN, Publish Date - Jan 12 , 2024 | 01:13 PM

విశాఖ నార్త్ నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్రాతి పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు.

విశాఖపట్నం: విశాఖ నార్త్ నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్రాతి పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు కోసం మార్పులు చేస్తున్నామన్నారు. నిన్న 20 అసెంబ్లీ స్థానాల్లో మార్పు చేశామన్నారు.

నిన్న చేసిన మార్పుల్లో బీసీలకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని సుబ్బారెడ్డి అన్నారు. చంద్రబాబు వర్గాలను రెచ్చగొట్టి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ముద్రగడ జనసేనలోకి చేరడంపై తనకు తెలియదని.. అసలు దానిపై అవగాహన కూడా లేదని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కుటుంబంలో అర్హులైన వారు ఉంటే వారికీ సీట్లు ఇస్తున్నామన్నారు. కుటుంబ పరంగా తాము సీట్లు ఇవ్వడం లేదని.. ప్రజాబలం ఉన్న వారికి మాత్రమే సీట్లు ఇస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Updated Date - Jan 12 , 2024 | 01:35 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising