ఎంఫసిస్లో 15% వాటా విక్రయించిన బ్లాక్స్టోన్
ABN, Publish Date - Jun 11 , 2024 | 04:39 AM
ఐటీ కంపెనీ ఎంఫసిస్ ప్రమోటర్ బ్లాక్స్టోన్.. కంపెనీలో 15.08 శాతం వాటాకు సమానమైన 2.85 కోట్ల షేర్లను రూ.6,735 కోట్లకు
ఐటీ కంపెనీ ఎంఫసిస్ ప్రమోటర్ బ్లాక్స్టోన్.. కంపెనీలో 15.08 శాతం వాటాకు సమానమైన 2.85 కోట్ల షేర్లను రూ.6,735 కోట్లకు బహిరంగ మార్కెట్లో భారీ బ్లాక్ డీల్ ద్వారా విక్రయించింది. ఒక్కో షేరును సగటున రూ.2,363.37కు విక్రయించింది. ఈ డీల్ తర్వాత ఎంఫసిస్లో బ్లాక్స్టోన్ వాటా 55.45 శాతం నుంచి 40.37 శాతానికి తగ్గింది. అయినప్పటికీ, కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా కొనసాగనుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు నమోదైన రెండో అతిపెద్ద బ్లాక్ డీల్ ఇదే. సోమవారం ఇంట్రాడేలో 4.82 శాతం వరకు క్షీణించిన ఎంఫసిస్ షేరు.. చివరికి దాదాపు 3 శాతం నష్టంతో రూ.2,398 వద్ద ముగిసింది.
Updated Date - Jun 11 , 2024 | 04:39 AM