ఫ్రియర్ ఎనర్జీ నుంచి ‘ఎక్స్పీరియన్స్’ సెంటర్లు
ABN, Publish Date - Sep 20 , 2024 | 05:02 AM
నివాస గృహా లు, ఎంఎ్సఎంఈలకు రూఫ్టాప్ సౌర విద్యుత్ వ్యవస్థ లు సరఫరాచేసే ‘ఫ్రియర్ ఎనర్జీ’ తన సేవలను మరింత విస్తరిస్తోంది. ఇందులో బాగంగా శనివారం కరీంనగర్లో తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటుచేస్తోంది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): నివాస గృహా లు, ఎంఎ్సఎంఈలకు రూఫ్టాప్ సౌర విద్యుత్ వ్యవస్థ లు సరఫరాచేసే ‘ఫ్రియర్ ఎనర్జీ’ తన సేవలను మరింత విస్తరిస్తోంది. ఇందులో బాగంగా శనివారం కరీంనగర్లో తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటుచేస్తోంది. వచ్చే నెల విశాఖపట్టణం, విజయవాడల్లోనూ ఈ కేంద్రాలు ఏర్పా టు చేస్తామని కంపెనీ ఎండీ సౌరభ్ మర్డా చెప్పారు. వచ్చే రెండేళ్లలో తాము పని చేస్తున్న ఆరు రాష్ట్రాల్లోని 48 నగరాలకు ఈ కేంద్రాలను విస్తరిస్తామన్నారు. ఈ ఎక్స్పీరియన్స్ కేంద్రాల్లో కంపెనీ ఏర్పాటు చేసే రూఫ్టాప్ సౌర విద్యుత్ వ్యవస్థలకు సంబంధించిన అన్ని సేవలు ఒకేచోట లభ్యమవుతాయి. తమ ఇంటిపై రూఫ్టాప్ సోలార్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేయాలనుకునే వ్యక్తు లు, సంస్థలు ఈ కేంద్రాల ద్వారా లేదా యాప్ ద్వారా తమను సంప్రదిస్తే ప్రభుత్వ సబ్సిడీ, రుణాలు మొదలుకుని అన్ని రకాల సేవలు అందిస్తామని సౌరభ్ చెప్పారు.
గత ఆర్థిక సంవత్సరం రూ.100 కోట్లున్న తమ టర్నోవర్ ఈ ఆర్థిక సంవత్సరం రెట్టింపు అవుతుందని ఆశిస్తున్నట్టు కంపెనీ కౌ-ఫౌండర్, డైరెక్టర్ రాధికా చౌదరి తెలిపారు. ఐదేళ్ల వారెంటీతో తమ రూఫ్టాప్ సోలార్ సిస్టమ్స్ లభిస్తాయన్నారు.
Updated Date - Sep 20 , 2024 | 05:02 AM