ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ధర పెరిగినా పసిడికి తగ్గని గిరాకీ

ABN, Publish Date - May 01 , 2024 | 05:28 AM

ఈ ఏడాది మార్చితో ముగిసిన తొలి త్రైమాసికానికి (క్యూ1) భారత్‌లో బంగారం గిరాకీ వార్షిక ప్రాతిపదికన 8 శాతం పెరిగి 136.6 టన్నులకు చేరుకుంది. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. గడిచిన కొన్ని నెలల్లో

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 8% వృద్ధి, 136.6 టన్నులుగా నమోదు

3 నెలల్లో 19 టన్నుల గోల్డ్‌ కొనుగోలు చేసిన ఆర్‌బీఐ : డబ్ల్యూజీసీ వెల్లడి

న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చితో ముగిసిన తొలి త్రైమాసికానికి (క్యూ1) భారత్‌లో బంగారం గిరాకీ వార్షిక ప్రాతిపదికన 8 శాతం పెరిగి 136.6 టన్నులకు చేరుకుంది. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. గడిచిన కొన్ని నెలల్లో బంగారం ధరలు భారీగా పెరిగి సరికొత్త ఆల్‌టైమ్‌ గరిష్ఠాలకు చేరినప్పటికీ, దేశీయంగా బలమైన ఆర్థిక వాతావరణం ఈ విలువైన లోహానికి గిరాకీ కొనసాగేందుకు దోహదపడిందని డబ్ల్యూజీసీ రిపోర్టు పేర్కొంది. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) సైతం దూకుడుగా బంగారం కొనుగోళ్లు జరపడం మెరుగైన వృద్ధికి మరో కారణమని నివేదిక పేర్కొం ది. గత ఏడాది జనవరి-మార్చి కాలానికి గోల్డ్‌ డిమాండ్‌ 126.3 టన్నులుగా నమోదైంది. మరిన్ని ముఖ్యాంశాలు..

  • విలువపరంగా, క్యూ1లో బంగారం గిరాకీ 20 శాతం వృద్ధితో రూ.75,470 కోట్లకు పెరిగింది. సమీక్షా కాలంలో దేశీయంగా బంగారం ధరల సగటు 11 శాతం పెరిగినప్పటికీ, పసిడికి డిమాండ్‌ రెండంకెల స్థాయిలో వృద్ధి చెందడం గమనార్హం.

  • మొత్తం డిమాండ్‌లో స్వర్ణాభరణాల విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 4 శాతం పెరిగి 95.5 టన్నులకు చేరుకోగా.. పెట్టుబడి అవసరాల కోసం బంగారం కడ్డీలు, నాణేల కొనుగోళ్లు 19 శాతం వృద్ధి చెంది 41.1 టన్నులకు చేరుకున్నాయి. గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎ్‌ఫ)లోకి సైతం 2 టన్నులకు పైగా పెట్టుబడులు వచ్చాయి. విలువపరంగా బంగారు ఆభరణాల విక్రయాలు 15 శాతం పెరిగి రూ.52,750 కోట్లుగా, బంగారంలో పెట్టుబడులు 32 శాతం పెరిగి రూ.22,720 కోట్లుగా నమోదయ్యాయి.

  • ఈ జనవరి-మార్చిలో దేశీయంగా 38.3 టన్నుల బంగారం రీసైక్లింగ్‌ జరిగిందని, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 10 శాతం అధికమని డబ్ల్యూజీసీ తెలిపింది.

  • క్యూ1లో ఆర్‌బీఐ 19 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. గత ఏడాది మొత్తానికి కొనుగోలు చేసిన 16 టన్నుల కంటే అధికమిది. ఈ ఏడాదిలో మరింత బంగారం కొనుగోలు చేయనున్నట్లు ఆర్‌బీఐ సంకేతాలిచ్చిందని డబ్ల్యూజీసీ ఇండి యా రీజినల్‌ సీఈఓ సచిన్‌ జైన్‌ తెలిపారు.

  • ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో దేశంలోకి బంగారం దిగుమతులు వార్షిక ప్రాతిపదికన 25 శాతం పెరిగి 179.4 టన్నులకు చేరుకున్నాయి. 2023లో ఇదే సమయానికి 143.4 టన్నుల బంగారం దిగుమతైంది.

  • క్యూ1లో ప్రపంచవ్యాప్త బంగారం డిమాండ్‌ 3 శాతం పెరిగి 1,238 టన్నులకు చేరుకుంది. 2016 తర్వాత గోల్డ్‌ గ్లోబల్‌ డిమాండ్‌పరంగా ఇదే అత్యంత బలమైన త్రైమాసికమని డబ్ల్యూజీసీ తన నివేదికలో పేర్కొంది.

  • ఈ ఏడాది దేశంలో బంగారం డిమాండ్‌ 700-800 టన్నుల స్థాయిలో నమోదు కావచ్చు. ధరలు మరింత ఎగబాకిన పక్షంలో పసిడి గిరాకీ వార్షిక అంచనాలోని దిగువ శ్రేణికే పరిమితం కావచ్చు. గత ఏడాది గోల్డ్‌ డిమాండ్‌ 747.5 టన్నులుగా నమోదైంది. ప్రస్తుత త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌) విషయానికొస్తే, పసిడి ధరలు ఏప్రిల్‌లో అమాంతం పెరగడంతో పాటు ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో గిరాకీ స్తబ్దుగానే ఉండనుందని భావిస్తున్నాం.

- సచిన్‌ జైన్‌, రీజినల్‌ సీఈఓ, ఇండియా, డబ్ల్యూజీసీ

Updated Date - May 01 , 2024 | 05:28 AM

Advertising
Advertising