ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఈ ఏడాది స్టాక్‌ మార్కెట్లో ఎల్‌ఐసీ పెట్టుబడులు 1.30 లక్షల కోట్లు

ABN, Publish Date - Aug 12 , 2024 | 01:49 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఈక్విటీ మార్కెట్లో రూ.1.30 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) ఎండీ, సీఈఓ సిద్ధార్ధ మొహంతి వెల్లడించారు...

ఈ ఏడాది స్టాక్‌ మార్కెట్లో

ఎల్‌ఐసీ పెట్టుబడులు 1.30 లక్షల కోట్లు

సంస్థ ఎండీ, సీఈఓ సిద్ధార్థ మొహంతి వెల్లడి

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఈక్విటీ మార్కెట్లో రూ.1.30 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) ఎండీ, సీఈఓ సిద్ధార్ధ మొహంతి వెల్లడించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ స్టాక్‌ మార్కెట్లో రూ.132 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిందని, ఈ ఏడాది కూడా అదే స్థాయిలో ఇన్వెస్ట్‌ చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో పలు షేర్లలో రూ.38,000 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్లు ఆయన చెప్పారు. ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడుల ద్వారా ఎల్‌ఐసీ జూన్‌ త్రైమాసికంలో రూ.15,500 కోట్ల లాభం ఆర్జించిందన్నారు. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో ఆర్జించిన లాభం కన్నా ఇది 13.5 శాతం అధికమని ఆయన చెప్పారు. ఎల్‌ఐసీ పెట్టుబడులకు సంబంధించి మరిన్ని వివరాలు..


  • గత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో ఎల్‌ఐసీ ఈక్విటీ మార్కెట్‌ పెట్టుబడులు రూ.23,300 కోట్లుగా ఉన్నాయి.

  • ఈ ఏడాది జూన్‌ 30 నాటికి వివిధ కంపెనీల్లో ఎల్‌ఐసీ పెట్టుబడుల మొత్తం విలువ రూ.15 లక్షల కోట్లకు చేరింది. అదే తేదీ నాటికి మొత్తం 282 కంపెనీల్లో ఎల్‌ఐసీ పెట్టుబడులున్నాయి.

  • జూన్‌ చివరి నాటికి ఎల్‌ఐసీ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ 16.22 శాతం పెరిగి రూ.53,58,781 కోట్లకు చేరింది. గత ఏడాది జూన్‌ చివరికి ఈ విలువ రూ.46,11,067 కోట్లుగా ఉంది.

  • 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ మొత్తం పెట్టుబడులు రూ.7,30,662 కోట్ల మేరకు పెరిగి రూ.42,44,852 కోట్ల (2023 మార్చి 31) నుంచి రూ.49,75,514 కోట్లకు (2024 మార్చి 31) చేరింది.

  • మొత్తం పెట్టుబడిలో ఈక్విటీ పెట్టుబడుల వాటా 2022-23లో రూ.8,39,622 కోట్లుగా ఉండగా 2024 మార్చి 31 నాటికి రూ.12,39,740 కోట్లకు చేరింది. ఇదే కాలంలో ఇతర విభాగాల్లో పెట్టుబడులు రూ.34,05,190 కోట్ల నుంచి రూ.37,35,774 కోట్లకు పెరిగాయి.

Updated Date - Aug 12 , 2024 | 01:50 AM

Advertising
Advertising
<