భారత్లో మరిన్ని నియామకాలు: సేల్స్ఫోర్స్
ABN, Publish Date - Sep 20 , 2024 | 05:00 AM
కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (సీఆర్ఎం) సేవల రంగంలో ఉన్న సేల్స్ఫోర్స్ భారత్లో తన కార్యకలాపాలను మరింత విస్తృతం చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్, బెంగళూరుల్లోని కేంద్రాలను...
శాన్ఫ్రాన్సిస్కో (అమెరికా): కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (సీఆర్ఎం) సేవల రంగంలో ఉన్న సేల్స్ఫోర్స్ భారత్లో తన కార్యకలాపాలను మరింత విస్తృతం చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్, బెంగళూరుల్లోని కేంద్రాలను మరింత విస్తరించాలని నిర్ణయించింది. ఇందుకోసం మరిన్ని నియామకాలు చేపట్టనున్నట్టు సేల్స్ఫోర్స్ ఇండియా చీఫ్ అరుంధతీ భట్టాచార్య చెప్పారు. అయితే ఎంత మందిని తీసుకునేదీ ఆమె వెల్లడించలేదు. గత రెండేళ్లలోనే భారత్లో తమ ఉద్యోగుల సంఖ్య రెట్టింపు పైగా పెరిగి 13,000 దాటిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఇన్నొవేషన్ హబ్ల అభివృద్ధి కోసం మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్టు సేల్స్ఫోర్స్ ఇంజినీరింగ్ విభాగం చీఫ్ శ్రీని తల్లాప్రగడ తెలిపారు.
Updated Date - Sep 20 , 2024 | 05:00 AM