ఫోక్స్వ్యాగన్ సరికొత్త టైగున్
ABN, Publish Date - Apr 24 , 2024 | 06:00 AM
జర్మనీకి చెందిన ఆటోమొబైల్ కంపెనీ ఫోక్స్వ్యాగన్.. దేశీయ మార్కెట్లోకి తన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్యూవీ) టైగున్లో రెండు కొత్త వేరియంట్స్ను విడుదల చేసింది...
చెన్నై: జర్మనీకి చెందిన ఆటోమొబైల్ కంపెనీ ఫోక్స్వ్యాగన్.. దేశీయ మార్కెట్లోకి తన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్యూవీ) టైగున్లో రెండు కొత్త వేరియంట్స్ను విడుదల చేసింది. పోర్టుఫోలియోను మరింతగా విస్తరించే ఉద్దేశంతో టైగున్ జీటీ లైన్, జీటీ ప్లస్ స్పోర్ట్ను మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు కంపెనీ తెలిపింది. 1.0 లీటర్ టీఎ్సఐ ఇంజన్తో కూడిన టైగు న్ జీటీ లైన్ ధర రూ.14.08 లక్షలుగా ఉండగా 1.5 లీటర్ టీఎ్సఐ ఇంజన్ కలిగిన జీటీ ప్లస్ స్పోర్ట్ ధర రూ.18.53 లక్షలు (ఎక్స్షోరూమ్)గా ఉందని పేర్కొంది. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఫోక్స్వ్యాగన్ యాన్యువల్ బ్రాండ్ కాన్ఫరెన్స్లో భాగంగా ఈ ఎస్యూవీలను కంపెనీ ఆవిష్కరించింది.
Updated Date - Apr 24 , 2024 | 06:00 AM