ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Varalakshmi Vratam: వరలక్ష్మీ వ్రతం ఇలా చేస్తే మీ ఇంట సిరుల పంట..!

ABN, Publish Date - Aug 15 , 2024 | 04:58 PM

శ్రావణ మాసం అనగానే గుర్తొచ్చేది వ్రతాలు, నోములు, పూజలు.. ముఖ్యంగా శ్రావణ మాసంలో శుక్రవారం వచ్చిందంటే చాలు.. లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తుంటాం. సౌభాగ్యం, సంపదలు, కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు ఈ మాసంలో ఆచరించే వాటిలో వరలక్ష్మీ వ్రతం ప్రధానమైనది.

Varalakshmi Vrat

శ్రావణ మాసం అనగానే గుర్తొచ్చేది వ్రతాలు, నోములు, పూజలు.. ముఖ్యంగా శ్రావణ మాసంలో శుక్రవారం వచ్చిందంటే చాలు.. లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తుంటాం. సౌభాగ్యం, సంపదలు, కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు ఈ మాసంలో ఆచరించే వాటిలో వరలక్ష్మీ వ్రతం ప్రధానమైనది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ వ్రతం గురించి సాక్షాత్తూ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్టు స్కాంద పురాణం పేర్కొంటోంది. భక్తుల పాలిట వరాల కల్పవల్లి అయిన వరలక్ష్మి రూప, గుణ విశేషాలన్నీ శ్రీసూక్తంలో ప్రస్తావితమై ఉన్నాయి. శ్రావణమాసంలో మొత్తం నాలుగు శుక్రవారాలు ఉన్నప్పటికీ ఎక్కువమంది శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆరోజు చేసుకోలేనివారు నాలుగు వారాల్లో ఏదో ఒక వారం వరలక్ష్మీవ్రతాన్ని చేసుకుంటారు.


కార్యసిద్ధి, సంసారబంధ విమోచనం వల్ల సిద్ధించే మోక్షం, ఆటంకాలను అధిగమించి పొందే జయం, విద్య, సంపద, శ్రేష్టత... ఇవన్నీ వరలక్ష్మీ స్వరూపమైన సద్గుణాలు. ఆ గుణాలను పొందడానికి ఉద్దేశించినదే వరలక్ష్మీ వ్రతం. ఇది అన్ని వ్రతాలలోనూ శ్రేష్టమైనదని పురాణాలు చెబుతున్నాయి. అంతటి విశిష్టమైన ఈ వ్రతాన్ని ఆచరించి, లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి తగిన ప్రవర్తన కలిగి ఉండాలని చారుమతి పాత్ర ద్వారా శ్రీ వరలక్ష్మీ వ్రతకథ చెబుతోంది.


Varalakshmi Vratam: వరాలు కురిపించే వరమహాలక్ష్మి పూజకు కావాల్సిన పూజ సామాగ్రి ఇదే..!

లక్ష్మీ పూజ అంటే కేవలం ధన, కనక, వస్తు రూపాలను అర్థించడానికి కాదు... భావ దారిద్ర్యాన్ని తొలగించాలని ప్రార్థించడానికి. మంచి గుణాలు, సంపద, ఉత్సాహం, కళాకాంతులు, ఆనందం, శాంతం, పెద్దల పట్ల గౌరవం, సామరస్యం, మంచి మనస్తత్వం, లోకహితాన్ని కోరుకోవడం... ఇవన్నీ లక్ష్మీప్రదమైన లక్షణాలు. వాటిని కోరుకుంటూ లక్ష్మీ పూజ చేయాలి. మనలో అంతర్గతంగా ఉండే దైవిక శక్తులను చైతన్యపరిచేది పరాశక్తికి ప్రతిరూపమైన శ్రీమహాలక్ష్మి అంటారు పెద్దలు.. ఆమె ఆరాధనే వరలక్ష్మీ వ్రతం. అంతటి పవిత్రమైన వరలక్ష్మీవ్రతాన్ని ఎలా ఆచరించాలి.. పూజకు అవసమైన సామాగ్రి గురించి తెలుసుకుందాం.


వరలక్ష్మీవ్రతం కోసం కావాల్సిన సామాగ్రి..

వరలక్ష్మీ అమ్మవారి ఫోటో

పసుపు

కుంకుమ

గంధం

విడిపూలు

పూల మాలలు (అవకాశాన్ని బట్టి)

తమలపాకులు

వక్కలు

అగరవత్తులు

కర్పూరము

చిల్లర నాణేలు

తెల్ల టవల్

బ్లౌస్ పీసులు

మామిడి ఆకులు

అరటిపండ్లు

ఇతర రకాల పండ్లు (స్థోమత ఆధారంగా)

కలశము

కొబ్బరి కాయలు 3

తెల్ల దారము లేదా నోము దారము లేదా పసుపు రాసిన కంకణం

స్వీట్లు

బియ్యం

కొద్దిగా పంచామృతం లేదా పాలు

శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అంటే ఆగష్టు 16వ తేదీన వరలక్ష్మీ వ్రతాన్ని ఎక్కువమంది ఆచరిస్తారు. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వీలుకాకపోతే.. తరువాత వచ్చే శ్రావణ శుక్రవారాల్లో కూడా ఈవ్రతాన్ని చేసుకోవచ్చు. అయితే శ్రావణ మాసం రెండవ శుక్రవారానికి ప్రాశస్త్యం ఎక్కువ.

Varalakshmi Vratham 2024: వరలక్ష్మీ వ్రతానికి శుభ ముహూర్తం ఇదే..


వ్రతం చేసే విధానం..

వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటినిశుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చు కోవాలి. పూజాసామగ్రిని సిద్ధం చేసుకోవాలి. దారంతో తయారుచేసిన తోరాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలి.. అక్షతలు, పసుపు గణపతిని సిద్ధంగా ఉంచు కోవాలి. వరలక్ష్మీవ్రతం సందర్భంగా మహిళలు తమ చేతికి తోరం కట్టుకుంటారు. తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారు చేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలను తయారు చేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి. వరలక్ష్మీవ్రత కల్ప కథ చదువుకున్న తర్వాత చివరిగా కొబ్బరికాయ కొట్టి, హరతితో పూజను ముగించాలి.


వరలక్ష్మీ వ్రత కథ..

ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా

ఓం మాధవాయ స్వాహా గోవిందాయ నమః (చేతిలోకి నీటిని తీసుకుని వదిలిపెట్టాలి)

విష్ణవే నమః మధుసూదనాయ నమః

త్రివిక్రమాయ నమః వామనాయ నమః

శ్రీధరాయ నమః హృషికేశాయ నమః

పద్మనాభాయ నమః దామోదరాయ నమః

సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః

ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః

పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః

నారసింహాయ నమః అచ్యుతాయ నమః

జనార్ధనాయ నమః ఉపేంద్రాయ నమః

హరయే నమః శ్రీకృష్ణాయ నమః

శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః (అని పై నామములను స్మరింపవలెను)

శ్లో|| ఉత్తిష్ఠంతుభూతపిశాచాః ఏతే భూమిభారకాః |

ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||

పై శ్లోకము చదివి అక్షతలు వాసన చూచి తమ ఎడమవైపున వేసుకొనవలయును.

ఆ తరువాత కుడిచేతితో ముక్కు పట్టుకొని ఈ క్రింది విధముగా ప్రాణాయామము చేయవలయును.

ప్రాణాయామము : గాయత్రి మంత్రాన్ని జపించాలి.

పై మంత్రముతో 3 మార్లు ప్రాణాయామము చేసి సంకల్పం చేయాలి.


సంకల్పం : ఓం మమ ఉపాత్తదురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శొభనే ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే అస్మిన్(ఆయా ప్రంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరానాం మధ్యే శ్రీశార్వరీనామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, శ్రావణమాసే, శుక్లపక్షే , ద్వాదశి తిధౌ, బృగువాసర యుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిదౌ, శ్రీమత్యాః …..(పేరు చెప్పాలి), గోత్రః ………(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారొగ్య ఐశ్వర్యాభివ్రుధ్యర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, ప్రారబ్ధదోష నివృత్తి ద్వారా శ్రీ వరలక్ష్మీ ప్రసాదేన అష్టైశ్వర్యయుత శ్రీమహాలక్ష్మీ ప్రాప్తర్థ్యర్థం, మనోవాంఛా పరిపూర్ణార్థం శ్రీ వరలక్ష్మీవ్రతం కరిష్యే అధౌనిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీమహా గణపతి స్మరణ పూర్వక పంచోపచార పూకాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే.

(కలశమునకు గంధపు బొట్లు పెట్టి అక్షింతలు వేసి, లోపల కొన్ని పుష్పాలు ఉంచి ఆ పాత్రను కుడి చేతితో మూసి ఈ క్రింది మంత్రం చెప్పాలి. )

కలశస్య ముఖే విష్ణు: కంఠే రుద్ర స్సమాశ్రిత:|

మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాత్రు గణా: స్మృతా:||

కుక్షౌతు సాగరా: సరేసప్త దీపా వసుంధరా|

ఋగ్వేదొ విధ యజుర్వేద: సామవేదొ హ్యధర్వణ:||

అంగైశ్చ సహితా: సర్వే కలశాంబు సమాశ్రితా:|

ఆయంతు దేవ పూజార్థం దురితక్షయ కారకా:||

కలశంలోని నీళ్ళు అమ్మవారిమీద పూజద్రవ్యాల మీద మామిడి ఆకు లేదా పుష్పంతో చల్లాలి.

గంగేచ యమునే చైవ గొదావరి సరస్వతి|

నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు||

కలశొదకేన పూజా ద్రవ్యాణి దేవమండపఆత్మానంచ సంప్రొక్ష్య

(కలశములొని నీటిని పూజ ద్రవ్యములపైన మన పైన చల్లుకోవాలి)


గణపతి పూజ ఇలా చేయండి.. (గణపతి పూజతో వ్రతం ప్రారంభం)

అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ

నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥

ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన

పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥

(వినాయకుడి పాదాలపై అక్షితలతో పూజించాలి.

  • ఓం సుముఖాయ నమః,

  • ఓం ఏకదంతాయ నమః,

  • ఓం కపిలాయ నమః,

  • ఓం గజకర్ణికాయ నమః,

  • ఓంలంబోదరాయ నమః,

  • ఓం వికటాయ నమః,

  • ఓం విఘ్నరాజాయ నమః,

  • ఓం గణాధిపాయ నమః,

  • ఓంధూమకేతవే నమః,

  • ఓం వక్రతుండాయ నమః,

  • ఓం గణాధ్యక్షాయ నమః,

  • ఓం ఫాలచంద్రాయ నమః,

  • ఓం గజాననాయ నమః,

  • ఓం శూర్పకర్ణాయ నమః,

  • ఓం హేరంబాయ నమః,

  • ఓం స్కందపూర్వజాయనమః,

  • ఓం శ్రీ మహాగణాధిపతయే నమః


నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి.

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి. అంటూ పసుపు విఘ్నేశ్వరుడి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి. అనంతరం

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,..భర్గోదేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్!! అంటూ

నీటిని నివేదన చుట్టూ జల్లుతూ … సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహాగుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటినివదలాలి).

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనం సమర్పయామి. (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి)

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి……నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి! అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీతసుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు! అంటూ …… వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి.

ఈ విధంగామహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.

అధాంగపూజ:- పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి.

  • చంచలాయై నమః – పాదౌ పూజయామి,

  • చపలాయై నమః – జానునీ పూజయామి,

  • పీతాంబరాయైనమః – ఉరుం పూజయామి,

  • కమలవాసిన్యైనమః – కటిం పూజయామి,

  • పద్మాలయాయైనమః– -నాభిం పూజయామి,

  • మదనమాత్రేనమః – స్తనౌ పూజయామి,

  • కంబుకంఠ్యై నమః- –కంఠంపూజయామి,

  • సుముఖాయైనమః – ముఖంపూజయామి,

  • సునేత్రాయైనమః – నేత్రౌపూజయామి,

  • రమాయైనమః – కర్ణౌ పూజయామి,

  • కమలాయైనమః – శిరః పూజయామి

  • శ్రీవరలక్ష్య్మైనమః – సర్వాణ్యంగాని పూజయామి.

  • (ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామాలతో పూజించాలి)

  • శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి

  • ఓం ప్రకృత్యై నమః

  • ఓం వికృతై నమః

  • ఓం విద్యాయై నమః

  • ఓం సర్వభూత హితప్రదాయై నమః

  • ఓం శ్రద్ధాయై నమః

  • ఓం విభూత్యై నమః

  • ఓం సురభ్యై నమః

  • ఓంపరమాత్మికాయై నమః

  • ఓం వాచ్యై నమః

  • ఓం పద్మాలయాయై నమః

  • ఓం శుచయే నమః

  • ఓంస్వాహాయై నమః

  • ఓం స్వధాయై నమః

  • ఓం సుధాయై నమః

  • ఓం ధన్యాయై నమః

  • ఓంహిరణ్మయై నమః

  • ఓం లక్ష్మ్యై నమః

  • ఓం నిత్యపుష్టాయై నమః

  • ఓం విభావర్యైనమః

  • ఓం ఆదిత్యై నమః

  • ఓం దిత్యై నమః

  • ఓం దీప్తాయై నమః

  • ఓం రమాయై నమః

  • ఓం వసుధాయై నమః

  • ఓం వసుధారిణై నమః

  • ఓం కమలాయై నమః

  • ఓం కాంతాయై నమః

  • ఓంకామాక్ష్యై నమః

  • ఓం క్రోధ సంభవాయై నమః

  • ఓం అనుగ్రహ ప్రదాయై నమః

  • ఓంబుద్ధ్యె నమః

  • ఓం అనఘాయై నమః

  • ఓం హరివల్లభాయై నమః

  • ఓం అశోకాయై నమః

  • ఓంఅమృతాయై నమః

  • ఓం దీపాయై నమః

  • ఓం తుష్టయే నమః

  • ఓం విష్ణుపత్న్యై నమః

  • ఓంలోకశోకవినాశిన్యై నమః

  • ఓం ధర్మనిలయాయై నమః

  • ఓం కరుణాయై నమః

  • ఓంలోకమాత్రే నమః

  • ఓం పద్మప్రియాయై నమః

  • ఓం పద్మహస్తాయై నమః

  • ఓంపద్మాక్ష్యై నమః

  • ఓం పద్మసుందర్యై నమః

  • ఓం పద్మోద్భవాయై నమః

  • ఓంపద్మముఖియై నమః

  • ఓం పద్మనాభప్రియాయై నమః

  • ఓం రమాయై నమః

  • ఓంపద్మమాలాధరాయై నమః

  • ఓం దేవ్యై నమః

  • ఓం పద్మిన్యై నమః

  • ఓం పద్మ గంధిన్యైనమః

  • ఓం పుణ్యగంధాయై నమః

  • ఓం సుప్రసన్నాయై నమః

  • ఓం ప్రసాదాభిముఖీయైనమః

  • ఓం ప్రభాయై నమః

  • ఓం చంద్రవదనాయై నమః

  • ఓం చంద్రాయై నమః

  • ఓంచంద్రసహోదర్యై నమః

  • ఓం చతుర్భుజాయై నమః

  • ఓం చంద్ర రూపాయై నమః

  • ఓంఇందిరాయై నమః

  • ఓం ఇందుశీతలాయై నమః

  • ఓం ఆహ్లాదజనన్యై నమః

  • ఓం పుష్ట్యెనమః

  • ఓం శివాయై నమః

  • ఓం శివకర్యై నమః

  • ఓం సత్యై నమః

  • ఓం విమలాయై నమః

  • ఓం విశ్వజనన్యై నమః

  • ఓం దారిద్ర నాశిన్యై నమః

  • ఓం ప్రీతా పుష్కరిణ్యైనమః

  • ఓం శాంత్యై నమః

  • ఓం శుక్లమాలాంబరాయై నమః

  • ఓం శ్రీయై నమః

  • ఓంభాస్కర్యై నమః

  • ఓం బిల్వ నిలయాయై నమః

  • ఓం వరారోహాయై నమః

  • ఓం యశస్విన్యైనమః

  • ఓం వసుంధరాయై నమః

  • ఓం ఉదారాంగాయై నమః

  • ఓం హరిణ్యై నమః

  • ఓంహేమమాలిన్యై నమః

  • ఓం ధనధాన్యకర్యై నమః

  • ఓం సిద్ధ్యై నమః

  • ఓం త్రైణసౌమ్యాయై నమః

  • ఓం శుభప్రదాయై నమః

  • ఓం నృపవేశగతానందాయై నమః

  • ఓంవరలక్ష్మ్యై నమః

  • ఓం వసుప్రదాయై నమః

  • ఓం శుభాయై నమః

  • ఓంహిరణ్యప్రాకారాయై నమః

  • ఓం సముద్రతనయాయై నమః

  • ఓం జయాయై నమః

  • ఓంమంగళాదేవ్యై నమః

  • ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః

  • ఓం ప్రసన్నాక్ష్యైనమః

  • ఓం నారాయణసీమాశ్రితాయై నమః

  • ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః

  • ఓంసర్వోపద్రవ వారిణ్యై నమః

  • ఓం నవదుర్గాయై నమః

  • ఓం మహాకాళ్యై నమః

  • ఓంబ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః

  • ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః

  • ఓంభువనేశ్వర్యై నమః

    (ఇక్కడితో గణపతిపూజ ముగిసింది. తోర పూజ మొదలుపెట్టుకోవాలి.)


తోరపూజ :- తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ క్రింది విధంగా పూజ చేయాలి.

  • కమలాయైనమః – ప్రథమగ్రంథిం పూజయామి,

  • రమాయైనమః – ద్వితీయ గ్రంథింపూజయామి,

  • లోకమాత్రేనమః – తృతీయ గ్రంథింపూజయామి,

  • విశ్వజనన్యైనమః – చతుర్థగ్రంథింపూజయామి,

  • మహాలక్ష్మ్యై నమః – పంచమగ్రంథిం పూజయామి,

  • క్షీరాబ్ది తనయాయై నమః – షష్ఠమ గ్రంథిం పూజయామి,

  • విశ్వసాక్షిణ్యై నమః – సప్తమగ్రంథిం పూజయామి,

  • చంద్రసోదర్యైనమః – అష్టమగ్రంథిం పూజయామి,

  • శ్రీ వరలక్ష్మీయై నమః – నవమగ్రంథిం పూజయామి.

ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి (వివాహితులు ఎడమచేతికి.. వివాహం కానివారు కుడి చేతికి తోరం కట్టుకోవాలి.)

బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం

పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే


వ్రత కథా ప్రారంభం

శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమ శివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి.

పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారదమహర్షి. ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తు న్నారు. ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీవ్రతం. దానిని శ్రావణమాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి…దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది.

కాత్యాయనీ…పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతః కాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని ప్రాతఃకాల గృహ కృత్యాలు పూర్తిచేసుకుని అత్తమామలను సేవించుకుని మితంగాసంభాషిస్తూ జీవిస్తూ ఉండేది.


వరలక్ష్మీ సాక్షాత్కారం

ఆది దేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ…ఈ శ్రావణపౌర్ణమి నాటికి ముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. “హే జననీ! నీకృపా కటాక్షములు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకుకలిగింది’’ అని పరిపరివిధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది.

అంతలోనే చారుమతి మేల్కొని, అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలిజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచ పల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో….

సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే

శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే !! అంటూ ఆహ్వానించి ప్రతిష్టించింది.


ఇంటికి వచ్చిన మహిళలంతా అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు ఘల్లుఘల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజ తరగ రథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకెళ్లారు. వారంతా మార్గ మధ్యంలో చారుమతిని వేనోళ్ళ పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు.

వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలు కలిగి, సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా… శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీ వ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు సిద్ధిస్తాయని సూతమహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరసుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి, పూజ చేసినవారు కూడా తీర్థప్రసాదాలు తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి. రాత్రి ఉపవాసం ఉండాలి.


భక్తితో వేడుకొంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది.

సర్వేజనాసుఖినోభవతు..

Sravana Masam : శ్రావణ మాసంలో ప్రతి రోజూ ప్రత్యేకమే..!

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Devotional News and Latest Telugu News

Updated Date - Aug 16 , 2024 | 12:47 PM

Advertising
Advertising
<