ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడిలో మేయర్‌ సహా 25 మంది మృతి

ABN, Publish Date - Oct 17 , 2024 | 06:44 AM

లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ మరోసారి భీకర దాడులు జరిపింది. దక్షిణ లెబనాన్‌ నెబాతియే ప్రావిన్స్‌లోని కానా పట్టణంతో పాటు బీరూట్‌ శివారు ప్రాంతాలపై మంగళవారం అర్ధరాత్రి, బుధవారం

బీరూట్‌, అక్టోబరు 16: లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ మరోసారి భీకర దాడులు జరిపింది. దక్షిణ లెబనాన్‌ నెబాతియే ప్రావిన్స్‌లోని కానా పట్టణంతో పాటు బీరూట్‌ శివారు ప్రాంతాలపై మంగళవారం అర్ధరాత్రి, బుధవారం తెల్లవారుజామున వైమానికి దాడులు చేసింది. ఈ దాడుల్లో మేయర్‌ అహ్మద్‌ కహిల్‌ సహా 25 మంది మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, హెజ్‌బొల్లాకు పట్టున్న ప్రాంతాల నుంచి తక్షణమే ఐక్యరాజ్యసమితి దళాలు వైదొలగాలని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు డిమాండ్‌ చేశారు. గతేడాది అక్టోబరు నుంచి లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో దాదాపు 2300 మంది ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.

Updated Date - Oct 17 , 2024 | 06:44 AM