ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Israeli: తీవ్ర ఉద్రిక్తతల వేళ.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన

ABN, Publish Date - Aug 25 , 2024 | 01:26 PM

లెబనాన్‌లోకి చొచ్చుకెళ్లి హిజ్బుల్లా సైన్యానికి చెందిన వందలాది రాకెట్ లాంఛర్లను ధ్వంసం చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమాన్ నెతన్యాహు కీలక ప్రకటన విడుదల చేసింది. తనను తాను రక్షించుకునేందుకు ఇజ్రాయెల్ అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు.

లెబనాన్‌లోకి చొచ్చుకెళ్లి హిజ్బుల్లా సైన్యానికి చెందిన వందలాది రాకెట్ లాంఛర్లను ధ్వంసం చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమాన్ నెతన్యాహు కీలక ప్రకటన విడుదల చేసింది. తనను తాను రక్షించుకునేందుకు ఇజ్రాయెల్ అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆయన కీలక ప్రకటన విడుదల చేశారు. ‘‘ మా దేశాన్ని రక్షించుకునేందుకు, దేశ ఉత్తరాది ప్రజలను తిరిగి సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు సాధ్యమైనవన్నీ చేయాలని నిశ్చయించుకున్నాం. మాకు ఎవరైనా హాని కలిగిస్తే.. వారికి మేం హాని చేస్తాం.. ఈ సాధారణ నియమాన్ని పాటిస్తూ ముందుకు సాగుతాం’’ అని బెంజిమాన్ నెతన్యాహూ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


కాగా తమ సీనియర్ కమాండర్‌ను చంపినందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై దాడుల చేస్తామని హిజ్బుల్లా ప్రకటించింది. ఈ మేరకు సన్నద్ధమవుతున్న విషయాన్ని పసిగట్టిన ఇజ్రాయెల్‌.. ఆత్మరక్షణ కోసం ముందస్తు చర్యగా హిజ్బుల్లాకు చెందిన వందలాది రాకెట్లు, డ్రోన్‌లను ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన 100కిపైగా ఫైటర్ జెట్లు లెబనాన్‌లోకి చొచ్చుకెళ్లి ఈ దాడులు జరిపాయి.


కాగా లెబనాన్‌‌లోని హిజ్బుల్లా రాకెట్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌ ఈ దాడులకు ఆమోదం తెలపడంతో దళాలు రంగంలోకి దాయి. కాగా దాడి విషయాన్ని ఇజ్రాయెల్, హిజ్బుల్లా ప్రకటనల ద్వారా నిర్ధారించాయి. కూడా చేశాయి.

Updated Date - Aug 25 , 2024 | 01:32 PM

Advertising
Advertising
<