ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jagannath Rath Yatra : పూరీ రథయాత్రలో తొక్కిసలాట

ABN, Publish Date - Jul 08 , 2024 | 05:18 AM

ఒడిశాలోని సముద్రతీర క్షేత్రం పూరీలో ఆదివారం నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. రథయాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక భక్తుడు మృతిచెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బలభద్రుడి తాళధ్వజ రథాన్ని

ఒక భక్తుడి మృతి.. ఐదుగురికి తీవ్రగాయాలు.. బలభద్రుడి రథం లాగుతుండగా ఘటన

డీహైడ్రేషన్‌, శ్వాస సమస్యలతో 300 మంది ఆసుపత్రికి

లక్షలాది భక్తులతో పూరీ కిటకిట

వేడుకలకు హాజరైన రాష్ట్రపతి ముర్ము

భువనేశ్వర్‌, జూలై 7: ఒడిశాలోని సముద్రతీర క్షేత్రం పూరీలో ఆదివారం నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. రథయాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక భక్తుడు మృతిచెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బలభద్రుడి తాళధ్వజ రథాన్ని లాగడానికి భక్తులు ఒక్కసారిగా ఎగబడటం ఈ దుర్ఘటనకు దారితీసింది. తొక్కిసలాటలో కింద పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిన గుర్తు తెలియని 60ఏళ్ల వృద్ధుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తొక్కిసలాటలో గాయపడిన మరో ఐదుగురిని కూడా ఆస్పత్రికి తరలించగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు విపరీతమైన ఎండ, ఉక్కపోతతో యాత్రకు హాజరైన 300మందికి పైగా భక్తులు డీహైడ్రేషన్‌, శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరారు. వీరిలో 50 మందిని ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జి చేశారు. ఒడిశా ఆరోగ్యశాఖ కార్యదర్శి అస్పత్రికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

మార్మోగిన ‘జై జగన్నాథ్‌’ నినాదాలు

పూరీ జగన్నాథుడి రథయాత్ర ఆదివారం కోలాహలంగా ప్రారంభమైంది. 1971 తర్వాత తొలిసారిగా ఈ ఏడాది రెండు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించడానికి దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆలయం నుంచి దేవతామూర్తులను రథాల వద్దకు తీసుకొచ్చే పహండి కార్యక్రమం మధ్యాహ్నం 2.15 గంటలకు ముగిసింది. గర్భాలయం నుంచి మూలవిరాట్టు బయలుదేరే ముందు మంగళహరతి, మైలం, నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం తదితర ఆచారాలు నిర్వహించారు. తొలుత బలభద్రుడిని తాళధ్వజ రథంపైకి, సుభద్రను దర్పదలన్‌ రథంపైకి చేర్చారు. భక్తుల జయజయధ్వానాల మధ్య జగన్నాథుడు తన నందిఘోష్‌ రథం వద్దకు చేరుకున్నారు. పహండీ అనంతరం రథాలను అధిష్ఠించిన దేవతామూర్తులకు పూరీ శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి ప్రత్యేకపూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 4గంటలకు పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌ దేవ్‌ రథాలపై చెరాపహరా (చీపురుతో రథాలను శుభ్రం చేసే ప్రక్రియ) చేశారు. రథాలకు చెక్క గుర్రాలను అమర్చిన తర్వాత రథయాత్ర ప్రారంభమైంది. సాయంత్రం 4.50 గంటలకు బలభద్రుడి రథం తాళధ్వజం ముందుగా బయలుదేరింది. ఆ తర్వాత 6 గంటలకు దర్పదలన రథంలో సుభద్ర దేవి కదిలారు. 6.45 గంటలకు నందిఘోష్‌ రథంలో జగన్నాథుడి యాత్ర కదిలింది. ఈ ఊరేగింపు జగన్నాథుడి ఆలయం వద్ద ప్రారంభమై అక్కడకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయం వద్దకు చేరుకొంటుంది. ఆదివారం రాత్రి రథయాత్ర ముగిసే సమయానికి బలభద్రుడు, దేవి సుభద్ర రథాలు గ్రాండ్‌ రోడ్డులోకి ప్రవేశించాయి. మారికోట్‌ చాక్‌ వద్ద, రాజ్‌ ప్యాలెస్‌ సమీపంలో ఈ రెండింటినీ వరుసగా నిలిపివేశారు. జగన్నాథుడి రథం ఆలయ సింహద్వారం నుంచి బయలుదేరి కొన్ని అడుగులు ప్రయాణించిన తర్వాత ఆగిపోయింది. సోమవారం ఉదయం రథయాత్ర తిరిగి ప్రారంభంకానుంది. కాగా, రథయాత్రలో దాదాపు 15 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేసిన అధికారులు ఆ మేరకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి రాష్ట్రపతి ముర్ము రథయాత్రను వీక్షించారు. మూడు రథాలకు ప్రదక్షిణలు చేసి బలభద్రుడి తాళధ్వజాన్ని, సుభద్ర దర్పదలన రథాన్ని ముర్ము ప్రారంభించారు. పూరీ రథయాత్రలో దేశ రాష్ట్రపతి పాల్గొనడం ఇదే మొదటిసారి. కాగా పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత ఆదివారం ఇస్కాన్‌ ఆధ్వర్యంలో కోల్‌కతాలో నిర్వహించిన జగన్నాథుడి రథయాత్రలో పాల్గొన్నారు. రథాన్ని లాగారు.

Updated Date - Jul 08 , 2024 | 05:18 AM

Advertising
Advertising
<