ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కంగన కారుకూతలతో బీజేపీకి నష్టం

ABN, Publish Date - Sep 26 , 2024 | 05:38 AM

మండి ఎంపీ కంగనారనౌత్‌ కారుకూతలతో బీజేపీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జయధీర్‌ షెర్గిల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె నిరాధారమైన.. అర్థంపర్థం లేని వ్యాఖ్యలు

సాగు చట్టాలను తిరిగి తేవాలనడం తప్పు

ఆ వ్యాఖ్యలకు బీజేపీకి సంబంధం లేదు

బీజేపీ అధికార ప్రతినిధి జయవీర్‌ షెర్గిల్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: మండి ఎంపీ కంగనారనౌత్‌ కారుకూతలతో బీజేపీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జయధీర్‌ షెర్గిల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె నిరాధారమైన.. అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సిక్కు సామాజికవర్గం,పంజాబ్‌ రైతులపై ఆమె చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా తర్కవిరుద్ధం. పంజాబ్‌ అభివృద్ధికి ప్రధాని మోదీ చేస్తున్న కృషికి కంగన తీరు విఘాతం కలిగిస్తోంది’’ అని ఆయన స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ కంగన తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు. సాగు చట్టాలను తిరిగి తీసుకురావాలని కంగన చెప్పడాన్ని తప్పుబట్టారు. ‘‘కంగన కారుకూతలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. ఆమె వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతారాహిత్యం’’ అని దుయ్యబట్టారు. సొంత పార్టీ బీజేపీ నుంచి కూడా వ్యతిరేకత వస్తుండడంతో కంగన నష్టనివారణ చర్యలను ప్రారంభించారు. ‘‘నా వ్యాఖ్యలపై భేషరతుగా క్షమాపణ చెబుతున్నాను. ఇకపై నేను పార్టీ అభిప్రాయాల మేరకు మాట్లాడతాను’’ అంటూ ఓ ప్రకటనను విడుదల చేశారు. బీజేపీ మరో అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా కూడా.. ‘‘కంగన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం. సాగు చట్టాలపై ఆమె మాటలు బీజేపీ విధానాన్ని ప్రతిబింబించబోవు’’ అని వ్యాఖ్యానించారు. కాగా, కంగన వ్యాఖ్యలపై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే తీవ్రంగా స్పందించారు. ‘‘750 మంది రైతులు చనిపోయిన తర్వాత కూడా రైతు వ్యతిరేక బీజేపీ, మోదీ ప్రభుత్వంలో మార్పు రాలేదు’’ అన్నారు. హరియాణాతోపాటు.. ఇతర రాష్ట్రాల్లో త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ప్రధాని మోదీ కూడా పార్లమెంట్‌ సాక్షిగా రైతులను ఆందోళనజీవులు, పరాన్నజీవులు అన్న విషయాన్ని గుర్తుచేశారు. ‘‘కంగనకు ఆరెస్సెస్‌, బీజేపీ నేపథ్యం లేదు. కేవలం మోదీ ప్రత్యేక శ్రద్ధతో మండి నుంచి ఆమె ఎంపీగా గెలిచేందుకు సహకరించారు. అందుకే.. కంగన వ్యాఖ్యలను మోదీ స్వయంగా ఖండించాలి’’ అని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.


హరియాణా ఎన్నికల వేళ దుమారం

పంజాబీ రైతులపై.. రైతు చట్టాలపై కంగన చేసిన వ్యాఖ్యలు హరియాణా అసెంబ్లీ ఎన్నికల వేళ తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. సాగుచట్టాలను తిరిగి తేవాలని, రైతులే ఆ డిమాండ్‌ చేయాలని ఆమె అనడంతో బీజేపీ ఇరకాటంలో పడిపోయింది. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహిన్‌బాగ్‌లో రోజుల తరబడి ఆందోళనలు చేపట్టిన రైతుల్లో పంజాబ్‌, హరియాణాకు చెందినవారే ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే..! హరియాణా ఎన్నికల ప్రచారంలో ఓ వైపు కాంగ్రెస్‌.. మరోవైపు ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) దూసుకుపోతుండగా.. కంగన తాజా వ్యాఖ్యలతో బీజేపీ ఆత్మరక్షణలో పడిపోయినట్లయింది.

Updated Date - Sep 26 , 2024 | 05:38 AM