ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Narayan Gangaram Surve House: ఎల్‌ఈడీ టీవీ చోరీ చేశాడు.. మళ్లీ తిరిగి ఇంట్లో పెట్టేశాడు.. ఎందుకంటే..?

ABN, Publish Date - Jul 16 , 2024 | 06:05 PM

చోరీకి వచ్చాడు.. మూటా ముల్లు అన్ని సర్దుకున్నాడు. వాటితోపాటు ఎల్‌ఈడీ టీవీ సైతం తనతో తీసుకు వెళ్లాడు. కానీ మళ్లీ ఎల్‌ఈడీ టీవీని తిరిగి ఆ ఇంట్లో పెట్టేశాడు.

చోరీకి వచ్చాడు.. మూటా ముల్లు అన్ని సర్దుకున్నాడు. వాటితోపాటు ఎల్‌ఈడీ టీవీ సైతం తనతో తీసుకు వెళ్లాడు. కానీ మళ్లీ ఎల్‌ఈడీ టీవీని తిరిగి ఆ ఇంట్లో పెట్టేశాడు. అంతేకాదు.. మీ ఇంట్లో చోరీకి వచ్చినందుకు తనను క్షమించండంటూ ఆ కుటుంబ సభ్యులకు ఓ లేఖ సైతం రాసి అక్కడ వదిలి వెళ్లిపోయారు. ఈ ఘటన ఇటీవల మహారాష్ట్రలోని నేరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సదరు దొంగ.. తాను చోరీకి వచ్చింది.. మరాఠీ ప్రముఖ కవి నారాయణ గంగారామ్ సర్వే నివాసానికి అని తర్వాత తెలుసుకున్నాడు.

Also Read: Doda encounter: దోడా ఘటన.. తమ పనే: కశ్మీర్ టైగర్స్ ప్రకటన

ఆ ఇంట్లో ఆయన పెద్ద చిత్ర పటాని చూసి దొంగ గుర్తు పట్టాడు. అంతే తాను దొంగిలించిన వస్తువులను అక్కడే వదిలేసి వచ్చిన దారిన వెళ్లిపోయాడు. పట్టణాల్లోని పని కార్మికులు గురించి.. వారు పడుతున్న వేదనలు, ఇబ్బందులపై మరాఠి కవి నారాయణ గంగారామ్ సర్వే ఎన్నో కవితలు రాశారు. అలా మరాఠాలో సుప్రసిద్ద కవుల ఆయన ఒకరిగా ఖ్యాతీ పొందారు. 2010లో ఆయన మరణించారు. దీంతో ఆయన నివాసంలో కుమార్తె సుజాత ఘరే, ఆమె భర్త గణేశ్ ఘరే‌తోపాటు వారి కుమారుడు నివసిస్తున్నారు.

Also Read: Chandrababu Govt: జులై 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం


అయితే జూన్ 26వ తేదీ వారు టూర్‌కు వెళ్లారు. ఇక జులై 14న మీ ఇంట్లో బాత్ రూమ్ తలుపు పగిలి ఉంది.. చోరీ ఏదైనా జరిగి ఉండవచ్చునంటూ పొరుగింటి వారు.. సుజాత ఘరేకు సమాచారం అందించారు. దీంతో వారు ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోని ఎల్‌ఈడీ టీవీ తప్పించి మరికొన్ని వస్తువుల ఆచూకీ లేకుండా పోయాయి. అయితే ఆమె తండ్రి చిత్రపటం వద్ద ఉన్న కాగితం మాత్రం వారిని ఆకర్షించింది.

Also Read:Notices To Ex MPs: 200 మందికి పైగా మాజీ ఎంపీలకు నోటీసులు

ఈ సందర్బంగా ఆ కాగితాన్ని వారు తీసి చదివారు. తాను చోరికి వచ్చింది.. మరాఠీ కవి నారాయణ గంగారామ్ సర్వే నివాసమని తనకు తెలియదన్నాడు. ఆయన నివాసంలో దొంగతానానికి వచ్చినందకు క్షమించాలని కోరాడు. ఆ క్రమంలో తాను చోరి చేసిన ఎల్‌ఈడీ టీవీని సైతం ఇక్కడే వదిలేశానని ఆ లేఖలో స్పష్టం చేశారు. మరోవైపు ఈ చోరీ ఘటనపై సుజాత ఘరే నేరల్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also Read:Doda encounter: ప్రభుత్వమే బాధ్యత వహించాలి

Also Read: justice narasimha reddy: సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం


అందులోభాగంగా చోరీ చేసి మళ్లీ వెనక్కి తీసుకు వచ్చిన ఎల్‌ఈడీ టీవీపై అతడి వేలి ముద్రలతోపాటు రహదారిపై సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులు నిశీతంగా పరిశీస్తున్నారు. అయితే చోరీకి వచ్చిన వారికి మనస్సు, మానవత్వంతో పాటు కవిత్వం కూడా తెలిసి ఉంటుందా? అని పోలీసులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ దొంగను సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామని నేరల్ పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 16 , 2024 | 06:16 PM

Advertising
Advertising
<