ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Narendra Modi: స్వాత్రంత్య్ర దినోత్సవం వేళ రికార్డు సృష్టించిన ప్రధాని మోదీ

ABN, Publish Date - Aug 15 , 2024 | 02:07 PM

దేశవ్యాప్తంగా ఘనంగా జెండా పండుగ జరిగింది. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఊరు-వాడా అన్ని చోట్లా జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది.

Narendra-Modi

దేశవ్యాప్తంగా ఘనంగా జెండా పండుగ జరిగింది. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఊరు-వాడా అన్ని చోట్లా జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది. ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద జెండా వందన కార్యక్రమం జరిగింది. జాతీయ పతావిష్కరణ అనంతరం వరుసగా 11వ సారి ఎర్రకోట వేదికగా మాట్లాడిన ప్రధాని మోదీ రికార్డు సృష్టించారు. ఏకంగా 98 నిమిషాల పాటు మాట్లాడి అత్యధిక సమయం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేసిన ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచారు. ఇవాళ సుధీర్ఘ ప్రసంగం చేయడంతో ఈ రికార్డు సొంతమైంది. దేశంలో నెలకొన్న అనేక సమస్యలను ప్రస్తావిస్తూ మోదీ ప్రసంగించారు. దీంతో ఆయన పేరిటే ఉన్న మునుపటి 94 రికార్డును ఆయన బద్దలు కొట్టారు.


2014 నుంచి 2024 వరకు ఎర్రకోటపై మోదీ ప్రసంగాల సమయం ఇదే..

1. 2014 - 65 నిమిషాలు

2. 2015 - 85 నిమిషాలు

3. 2016 - 94 నిమిషాలు

4. 2017 - 56 నిమిషాలు

5. 2018 - 83 నిమిషాలు

6. 2019 - 92 నిమిషాలు

7. 2020 - 86 నిమిషాలు

8. 2021 - 88 నిమిషాలు

9. 2022 - 83 నిమిషాలు

10. 2023 - 90 నిమిషాలు.


ఇక ఇతర ప్రధానమంత్రుల ప్రసంగాల విషయానికి వస్తే.. మోదీ కంటే ముందు 1947లో జవహర్‌లాల్ నెహ్రూ 72 నిమిషాలు, 1997లో ఐకే గుజ్రాల్ 71 నిమిషాలపాటు సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. ఇక తక్కువ సమయం ప్రసంగాల విషయానికి వస్తే జవహర్ లాల్ నెహ్రూ 1954, 1966లలో 14 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. ఇక మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా ఎర్రకోట నుంచి తక్కువ సమయం మాత్రమే ప్రసంగించారు. మన్‌మోహన్ సింగ్ 2012లో 32 నిమిషాలు, 2013లో 35 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. 2002, 2003లో నాటి ప్రధాని వాజ్‌పేయి 25 నిమిషాలు, 30 నిమిషాల కంటే తక్కువ సమయం స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాలు చేశారు.


11వ సారి జాతీయ పతాకావిష్కరణ

ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 6,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ఈ ఏడాది ఎర్రకోటలో జరిగే వేడుకలను చూసేందుకు యువకులు, గిరిజనులు, రైతులు, మహిళా వర్గాలతో పాటు ఇతర ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. అంతేకాదు వివిధ రంగాలకు చెందిన, వివిధ రంగాలలో రాణించిన వారిని వేడుకలకు ఆహ్వానించారు.

Updated Date - Aug 15 , 2024 | 02:07 PM

Advertising
Advertising
<