NRI: ఏపీ ప్రభుత్వం, తానా సంయుక్తంగా యూఎస్ఏలో ‘తానా పాఠశాల’ కార్యక్రమం
ABN, Publish Date - Jul 12 , 2024 | 08:56 PM
భాష సాంస్కృతిక వారధని భాను మాగులూరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తానా సంయుక్తంగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో “తానా పాఠశాల” విద్యార్థుల నమోదు కార్యక్రమం నిర్వహించింది.
(అమెరికా): భాష సాంస్కృతిక వారధని భాను మాగులూరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తానా సంయుక్తంగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో “తానా పాఠశాల” విద్యార్థుల నమోదు కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా బాలబాలికల తల్లిదండ్రులకు (NRI).. అమెరికా వ్యాప్తంగా పాఠశాల నిర్వహణ, పాఠ్యాంశాల మీద అవగాహన కల్పిస్తూ, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దలు, ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.
NRI: బ్రిస్బేన్లో టీడీపీ విజయోత్సవ సంబరాలు!
మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. అన్ని భాషల్లో గొప్ప భాష తెలుగని అన్నారు. అలాంటి తెలుగు భాషను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ‘‘తెలుగు భాషను చంపే తరంగా మనం మిగలకూడదు. ఏ భాష ప్రజలైనా వారి మాతృభాషలోనే మాట్లాడతారు. అందుకు వారు గర్వపడతారు. ప్రపంచ తెలుగుదనాన్ని ఒక గొడుగు కిందకు చేర్చిన తానా.. తెలుగుజాతికి అమెరికాలో గుర్తింపు, గౌరవం తెచ్చింది. మానవ నాగరికత, వికాసంలో మనం అత్యంత కీలకపాత్ర పోషిస్తున్నాం. మన సాంస్కృతిక వారసత్వ సంపదను కాపాడాలి’’ అని అన్నారు.
Read Latest NRI News and Telugu News
Updated Date - Jul 12 , 2024 | 09:47 PM