ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Politics: వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌ గూటికి ‘కాపు’!!

ABN, Publish Date - Jan 10 , 2024 | 11:26 AM

కాపునకు వైసీపీ అధిష్ఠానం టికెట్‌ నిరాకరించిన నేపథ్యంలో ఆయన తిరుగుబాటు బావుటా ఎగరేసిన విషయం తెలిసిందే.

అనంతపురం : కాంగ్రెస్‌ పార్టీ సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డితో అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి భేటీ అయ్యారు. కాపునకు వైసీపీ అధిష్ఠానం టికెట్‌ నిరాకరించిన నేపథ్యంలో ఆయన తిరుగుబాటు బావుటా ఎగరేసిన విషయం తెలిసిందే. రఘువీరారెడ్డితో కాపు రెండు గంటల పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. రఘువీరారెడ్డి నేతృత్వంలో ముందుగా ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ను కలుస్తారని సమాచారం.


కల్యాణదుర్గం నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని కాపు భావిస్తున్న నేపథ్యంలో... ముందుగా ఆ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ సభకు వైఎస్‌ షర్మిల హాజరయ్యేలా సన్నాహాలు చేస్తున్నారు. ఆమె సమక్షంలోనే కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. కాగా, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రఘువీరారెడ్డితో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో తాను రఘువీరారెడ్డిని కలిసేందుకు వచ్చానని ఎమ్మెల్యే కాపు మీడియాతో చెప్పారు.

Updated Date - Jan 10 , 2024 | 11:35 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising