ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PubG Love: మరో పబ్‌జీ లవ్.. ప్రియుడి కోసం అమెరికా నుంచి.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్

ABN, Publish Date - Jun 15 , 2024 | 01:03 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘పబ్‌జీ ప్రేమకథ’ అందరికీ గుర్తుండే ఉంటుంది. పబ్‌జీ ద్వారా పరిచయమైన సచిన్ కోసం పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్ అక్రమంగా..

American Girl Reached India To Meet Her PubG Love

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘పబ్‌జీ ప్రేమకథ’ (PubG Love Story) అందరికీ గుర్తుండే ఉంటుంది. పబ్‌జీ ద్వారా పరిచయమైన సచిన్ కోసం పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్ (Seema Haider) అక్రమంగా భారత్‌లో చొరబడి అతడ్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అలాంటి లవ్ స్టోరీనే మరొకటి చోటు చేసుకుంది. పబ్‌జీ ద్వారా అమెరికాకు చెందిన అమ్మాయికి భారత్‌కు చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడగా.. అది ప్రేమగా మారింది. దాంతో.. అతని కోసం 12 వేల కిలోమీటర్లు దాటుకొని వచ్చింది. అయితే.. వీరి కథలో పోలీసులు ఓ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళ్తే..


Read Also: మా రూమ్స్‌లో ఏసీలు పెట్టండి మహాప్రభో..

అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన బ్రూక్లిన్ కార్నెల్ (30)కి పబ్‌జీ గేమ్ అంటే ఎంతో ఇష్టం. తనకు వీలు దొరికినప్పుడల్లా ఆ గేమ్ ఆడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమెకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావాకు చెందిన హిమాన్షు యాదవ్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఆటలు, మాటలు పెరిగి.. ఆ స్నేహం ప్రేమగా మారింది. దీంతో.. ఇద్దరు కలవాలని నిర్ణయించుకున్నారు. హిమాన్షుకి అమెరికాకు వెళ్లే అవకాశం లేకపోవడంతో.. అతని కోసం బ్రూక్లిన్ భారత్‌కు చేరుకుంది. మూడు నెలల క్రితం ఆమె చండీగఢ్‌లో ల్యాండ్ అయ్యింది. ఆమెని కలిసేందుకు హిమాన్షు కూడా చండీగఢ్‌కి వెళ్లాడు. మరో క్షణం ఆలస్యం చేయకుండా.. ఇద్దరూ వివాహం చేసుకొని, అక్కడే కొన్ని రోజుల పాటు గడిపారు. అనంతరం హిమాన్షు ఆమెని తన సొంతూరైన ఇటావాకు తీసుకొచ్చాడు.


Read Also: ఎన్డీఏ ప్రభుత్వం పొరపాటున ఏర్పడింది

కొన్ని రోజులు ఇటావాలో బస చేసిన హిమాన్షు, బ్రూక్లిన్.. గురువారం (13-06-24) రాత్రి ఢిల్లీకి బయలుదేరారు. అయితే.. స్థానికులకు ఆ ఇద్దరిపై అనుమానం వచ్చింది. హిమాన్షు బలవంతంగా ఆ అమ్మాయిని తీసుకెళ్తున్నాడేమోనని భ్రమ పడి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఢిల్లీకి వెళ్లేందుకు వాళ్లు ఎక్కిన బస్సులోని కండక్టర్, డ్రైవర్‌లకు కూడా ఆ ఇద్దరిపై డౌట్ రావడంతో.. నేరుగా పోలీస్ స్టేషన్ వద్ద బస్సుని ఆపారు. ఫైనల్‌గా పోలీసులు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే.. తాను ఇష్టపూర్వకంగా హిమాన్షుతో కలిసి వెళ్లానని, అతను బలవంతం చేయలేదని బ్రూక్లిన్ తెలిపింది. ఢిల్లీ మీదుగా చండీగఢ్ వెళ్లాలనుకుంటున్నట్టు ఆమె పేర్కొంది. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి, ఇంకా విచారణ జరుపుతూనే ఉన్నారు.

Read Latest Viral News and Telugu News

Updated Date - Jun 15 , 2024 | 01:03 PM

Advertising
Advertising