ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Madhyapradesh: మహిళ దారుణం.. 13 ఏళ్ల కొడుకు తన మొబైల్ ఫోన్ తీసుకున్నాడని..

ABN, Publish Date - Aug 27 , 2024 | 04:21 PM

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ ఉన్మాదిలా మారి తన 13 ఏళ్ల కొడుకుపైనే కొడవలితో దాడికి తెగబడింది. తన సెల్‌ఫోన్ చూశాడన్న కోపంలో విచక్షణ మరిచిన ఆమె బాలుడిపై రెచ్చిపోయి దాడి చేసింది. దీంతో బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌కు (Madhyapradesh) చెందిన ఓ మహిళ ఉన్మాదిలా మారి తన 13 ఏళ్ల కొడుకుపైనే కొడవలితో దాడికి తెగబడింది. తన సెల్‌ఫోన్ చూశాడన్న కోపంలో విచక్షణ మరిచిన ఆమె బాలుడిపై రెచ్చిపోయి దాడి చేసింది. ఇండోర్‌ జిల్లాలోని సిమ్రోల్‌ గ్రామంలో ఆదివారం ఈ దారుణం వెలుగు చూసింది.

Viral: ఈమె అసలు తల్లేనా.. వివాహేతర సంబంధం.. ఆపై క్రైమ్ షో స్ఫూర్తితో..


తల్లి ఒడిగట్టిన దారుణం గురించి బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకున్నారు. తన స్కూల్‌ నుంచి ఏవైనా మెసేజీలు వచ్చాయేమో తెలుసుకునేందుకు తాను తల్లి మొబైల్ ఫోన్ తీసుకున్నానని బాలుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మొబైల్ ఫోన్ ఎందుకు టచ్ చేశావంటూ తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని అన్నాడు. ఆమె చివరకు విచక్షణ మరిచి కొడవలితో తనపై దాడికి తెగబడిందన్నాడు. దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తన ఎడమ చేతికి గాయమైందని కూడా తెలిపాడు (Indore Woman Attacks 13 Year Old Son With Sickle For Using Her Phone ). ఇక పోలీసులు బాలుడికి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరిపించారు.


‘‘ కుటుంబంలో వివాదం కారణంగా బాలుడు ప్రస్తుతం తన అమ్మమ్మ తాతయ్యల దగ్గర ఉంటున్నాడు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించాము. అయితే, బాలుడి తల్లిని ఇంకా అదుపులోకి తీసుకోలేదు. దర్యాప్తు అనంతరం మహిళపై తగు చర్యలు తీసుకుంటాము’’ అని స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

Read Viral and Telugu News

Updated Date - Aug 27 , 2024 | 04:43 PM

Advertising
Advertising
<