ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral News: విడాకులు తీసుకున్న భార్యాభర్తలు.. 12 ఏళ్ల తర్వాత కథలో దిమ్మతిరిగే ట్విస్ట్

ABN, Publish Date - Jun 11 , 2024 | 12:17 PM

విడాకులు తీసుకున్న జంటలు దాదాపు తమతమ వ్యక్తిగత జీవితాల్లో బిజీ అయిపోతారు. ఒకవేళ ఇద్దరి మధ్య ఒక మంచి అండర్‌స్టాండింగ్ ఉంటే.. స్నేహితులుగా మెలుగుతారే గానీ..

Uttar Pradesh Couple Married Again After 12 Years Of Divorce

విడాకులు (Divorce) తీసుకున్న జంటలు దాదాపు తమతమ వ్యక్తిగత జీవితాల్లో బిజీ అయిపోతారు. ఒకవేళ ఇద్దరి మధ్య ఒక మంచి అండర్‌స్టాండింగ్ ఉంటే.. స్నేహితులుగా మెలుగుతారే గానీ, మళ్లీ ఒక్కటి అవ్వరు. తమకు నచ్చిన లైఫ్ పార్ట్‌నర్‌ని ఎంపిక చేసుకొని, వారితో లైఫ్‌లో సెటిల్ అవుతారు. కానీ.. ఈ ఆర్టికల్‌లో మనం చెప్పుకోబోయే జంట కథ మాత్రం చాలా భిన్నమైనది. తాము విడాకులు తీసుకున్న 12 ఏళ్ల తర్వాత.. వాళ్లు అందరికీ ఊహించని షాక్ ఇచ్చారు. ఆ జంట ఇచ్చిన ట్విస్ట్‌కి.. ప్రతిఒక్కరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇంతకీ వాళ్లిచ్చిన ఆ ట్విస్ట్ ఏంటి? పదండి.. ఆర్టికల్‌లోకి వెళ్లి తెలుసుకుందాం!


ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన అఫ్సర్ అలీకి 2004లో ఓ మహిళతో వివాహం అయ్యింది. ఎనిమిది సంవత్సరాల వరకూ వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది. ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలతో పాటు ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే.. ఆ తర్వాతి నుంచి వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ప్రతి చిన్న విషయంలోనూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఈ వ్యవహారం తారాస్థాయికి చేరుకోవడంతో.. 2012లో ఆ దంపతులు విడాకులు తీసుకున్నారు. ఒక కుమార్తెని భార్య తనతో పాటు తీసుకెళ్లగా.. మిగిలిన ముగ్గురు పిల్లలు అలీ వద్దే ఉండిపోయారు. అలా విడిపోయిన ఆ జంట.. మళ్లీ ఎప్పుడూ కలుసుకోలేదు. ఒకరినొకరు సంప్రదించే ప్రయత్నమూ చేయలేదు. చూస్తుండగానే.. 12 సంవత్సరాలు గడిచిపోయాయి.


కట్ చేస్తే.. కొన్ని రోజుల క్రితం అలీ రాంపూర్‌లో ఓ వివాహ వేడుకకు హాజరయ్యాడు. అదే వేడుకకి అతని మాజీ భార్య హాజరైంది. ఆ వేడుకలో తారసపడిన తర్వాత వీళ్లు మొదట్లో కాసేపు మాట్లాడుకోలేదు. కేవలం ఒకరినొకరు చూస్తూ ఉండిపోయారు. కొద్దిసేపయ్యాక.. ఇద్దరి కళ్లల్లో నుంచి కన్నీళ్లు చెమర్చాయి. అనంతరం ఇద్దరు దగ్గరకు వచ్చి.. మరింత ఏడవడం మొదలుపెట్టారు. ఒక గంటసేపయ్యాక.. తమతమ ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. తమ బాధలు, అభిప్రాయాలు పంచుకున్న వాళ్లిద్దరు.. మళ్లీ కలిసి జీవించాలని నిర్ణయించారు. ఇలా జూన్ 8న వాళ్లు పెళ్లి చేసుకొని, తిరిగి ఇంటికి చేరుకున్నారు. వీళ్లిలా పెళ్లి చేసుకోవడంపై.. కుటుంబ సభ్యులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Latest Viral News and Telugu News

Updated Date - Jun 11 , 2024 | 12:17 PM

Advertising
Advertising