సిరాజ్కు సీఎం సన్మానం నజరానాగా ఇంటి స్థలం, ఉద్యోగం
ABN, Publish Date - Jul 10 , 2024 | 02:43 AM
టీ20 వరల్డ్కప్ నెగ్గిన భారత జట్టులో సభ్యుడైన మహ్మద్ సిరాజ్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకొన్నాడు...
హైదరాబాద్: టీ20 వరల్డ్కప్ నెగ్గిన భారత జట్టులో సభ్యుడైన మహ్మద్ సిరాజ్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకొన్నాడు. ఈ సందర్భంగా సిరాజ్ను సన్మానించిన సీఎం.. ఆటగాడిగా దేశానికి, రాష్ట్రానికి గొప్ప పేరుప్రఖ్యాతులు తీసుకువచ్చావని ప్రశంసించారు. సిరాజ్కు ఇంటి స్థలంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని రేవంత్ నిర్ణయించారు. నగర పరిసరాల్లో అనువైన స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. స్థాయికి తగిన ఉద్యోగాన్ని కల్పించే ప్రక్రియను ఆరంభించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ అనిల్కుమార్ యాదవ్, టీమిండియా మాజీ కెప్టెన్ అజరుద్దీన్ కూడా హాజరయ్యారు.
Updated Date - Jul 10 , 2024 | 02:43 AM