ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Virat Kohli: ఒత్తిడికి దూరంగా విరాట్ కోహ్లీ.. భార్యతో భక్తి కాన్సర్ట్‌కు

ABN, Publish Date - Oct 21 , 2024 | 03:46 PM

న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో తడబడినా రెండో ఇన్నింగ్స్‌లో 70 పరుగులు చేయగలిగాడు. అతను ప్రయత్నం చేసినప్పటికీ టీమిండియాను గట్టెక్కించలేకపోయాడు.

Virat kohli anushka

ముంబై: న్యూజిలాండ్ చేతిలో ఓటమి టీమిండియా ప్లేయర్లను ఒకింత ఒత్తిడికి గురిచేస్తోంది. రానున్న రెండో టెస్టు ఇన్నింగ్స్ పై ఆటగాళ్లు ఫోకస్ నిలిపారు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ వంటి వారిని నెటిజన్లు ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. టీమిండియా ఓటమికి జట్టు అసమర్థతే కారణమంటూ తిట్టిపోస్తున్నారు. మ్యాచ్ మొత్తంలో రిషభ్ పంత్, సర్ఫరజ్ ఖాన్ లాంటి వారే ఓ మోస్తర ఎఫర్ట్ పెట్టారని చర్చించుకుంటున్నారు. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో తడబడినా రెండో ఇన్నింగ్స్‌లో 70 పరుగులు చేయగలిగాడు. అతను ప్రయత్నం చేసినప్పటికీ టీమిండియాను గట్టెక్కించలేకపోయాడు.


నేరుగా ముంబైకి..

విరాట్ కోహ్లీ మాత్రం మ్యాచ్ ముగియగానే ముంబై వెళ్లిపోయాడు. భార్య అనుష్క శర్మతో కలిసి అక్కడ ఎంతో పాపులర్ అయిన కృష్ణ దాస్ ఈవెంట్ లో ప్రత్యక్షమయ్యాడు. వీరిద్దరూ కలిసి ఈవెంట్ లో కోలాహలంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట వైరలవుతోంది. కృష్ణ దాస్ ముంబైకి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గాయకుడు. అతనిని ’రాక్ స్టార్ ఆఫ్ యోగా‘గా పిలుస్తారు. గతంలో లండన్ లో వీరు నిర్వహించిన ఈవెంట్లోనూ విరాట్ జంట సందడి చేశారు.


ప్రస్తుతం ముంబైలో ఉన్న విరాట్ కోహ్లీ అక్టోబర్ 24న జరగనున్న మ్యాచ్ కోసం పుణె చేరుకోనున్నాడు. అక్టోబరు 24 నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. ఇందుకు పుణెలోని ఎంసీఏ స్టేడియం మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.

Kagiso Rabada: చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా పేసర్ రబాడ

Updated Date - Oct 21 , 2024 | 03:46 PM