ICC T20 Rankings : టాపర్గా కప్పు బరిలోకి..
ABN, Publish Date - May 30 , 2024 | 06:24 AM
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా టాప్ ర్యాంక్ను నిలబెట్టుకుంది. 264 పాయింట్లతో ఉన్న రోహిత్ సేన.. నెంబర్ వన్ హోదాతో వరల్డ్కప్ బరిలోకి దిగనుంది. ఆస్ట్రేలియా(257), ఇంగ్లండ్
దుబాయ్: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా టాప్ ర్యాంక్ను నిలబెట్టుకుంది. 264 పాయింట్లతో ఉన్న రోహిత్ సేన.. నెంబర్ వన్ హోదాతో వరల్డ్కప్ బరిలోకి దిగనుంది. ఆస్ట్రేలియా(257), ఇంగ్లండ్ (254) రెండు, మూడు ర్యాంకుల్లో ఉన్నాయి. ఇక, కప్పునకు ఆతిథ్యమిస్తున్న వెస్టిండీస్ ఏకంగా నాలుగోస్థానానికి ఎగబాకింది. ఇటీవల దక్షిణాఫ్రికాపై 3-0తో సిరీస్ నెగ్గడంతో కరీబియన్లు (252)ర్యాంకును మెరుగుపరచుకున్నారు. న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా వరుసగా 5, 6, 7 స్థానాల్లో నిలిచాయి.
Updated Date - May 30 , 2024 | 06:24 AM