నిరాశపర్చిన టైటాన్స్
ABN, Publish Date - Oct 23 , 2024 | 01:11 AM
ప్రొ కబడ్డీ తాజా సీజన్లో తెలుగు టైటాన్స్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. మంగళవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 52-22తో...
బెంగళూరు హ్యాట్రిక్ ఓటమి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రొ కబడ్డీ తాజా సీజన్లో తెలుగు టైటాన్స్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. మంగళవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 52-22తో టైటాన్స్పై ఘన విజయం సాధించింది. జైపూర్ కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 19 రైడ్ పాయిం ట్లతో చెలరేగాడు. టైటాన్స్ జట్టు కెప్టెన్ పవన్ (7 పాయిం ట్లు) మినహా మిగిలిన ప్లేయర్లంతా ఘోరంగా విఫలమ య్యారు. టైటాన్స్ పేలవ డిఫెన్స్ కారణంగా ఈ మ్యాచ్లో ఏకంగా నాలుగుసార్లు ఆలౌటైంది. మరో మ్యాచ్లో యూపీ యోధాస్ 57-36తో బెంగళూరు బుల్స్పై నెగ్గింది. బుల్స్కు ఇది హ్యాట్రిక్ పరాజయం.
Updated Date - Oct 23 , 2024 | 01:11 AM