Share News

వహ్‌వా..నిషా

ABN , Publish Date - May 11 , 2024 | 05:14 AM

వరల్డ్‌, ఒలింపిక్‌ గేమ్స్‌ క్వాలిఫయర్స్‌ టోర్నమెంట్‌లో భారత యువ రెజ్లర్‌ నిషా దహియా (68 కిలోలు) సత్తా చాటింది.

వహ్‌వా..నిషా

భారత్‌కు ఐదో ఒలింపిక్‌ బెర్త్‌ అందించిన రెజ్లర్‌

ఇస్తాంబుల్‌: వరల్డ్‌, ఒలింపిక్‌ గేమ్స్‌ క్వాలిఫయర్స్‌ టోర్నమెంట్‌లో భారత యువ రెజ్లర్‌ నిషా దహియా (68 కిలోలు) సత్తా చాటింది. తన విభాగంలో ఫైనల్స్‌కు దూసుకెళ్లి భారత్‌కు పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌ అందించింది. మహిళల రెజ్లింగ్‌లో భారత్‌కు ఇది ఐదో ఒలింపిక్‌ కోటా కావడం విశేషం. ఇప్పటికే వినేశ్‌ ఫొగట్‌ (50 కి), అంతిమ్‌ పంగల్‌ (53 కి), అన్షు మాలిక్‌ (57 కి), రితికా హుడా (76 కి) పారిస్‌ విశ్వ క్రీడలకు బెర్త్‌ సాధించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఇక్కడ జరిగిన సెమీఫైనల్లో నిషా 8-4తో అలెగ్జాండ్రా ఏంజెల్‌ (రొమేనియా)ను చిత్తుచేసింది. అంతకుముందు క్వార్టర్స్‌లో నిషా 7-4తో అడెలా హాన్‌జికోవా (చెక్‌)పై గెలిచింది.

Updated Date - May 11 , 2024 | 05:14 AM