జ్యోతికి క్రీడాశాఖ చేయూత
ABN, Publish Date - May 04 , 2024 | 05:26 AM
తెలుగు స్ర్పింటర్ యర్రాజి జ్యోతికి కేంద్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలోని ఎంఓసీ (మిషన్ ఒలింపిక్ సెల్) చేయూతనిచ్చింది. జ్యోతితో పాటు లాంగ్ జంపర్ శైలీ సింగ్, పలువురు షట్లర్లు...
న్యూఢిల్లీ: తెలుగు స్ర్పింటర్ యర్రాజి జ్యోతికి కేంద్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలోని ఎంఓసీ (మిషన్ ఒలింపిక్ సెల్) చేయూతనిచ్చింది. జ్యోతితో పాటు లాంగ్ జంపర్ శైలీ సింగ్, పలువురు షట్లర్లు, టేబుల్ టెన్నిస్ ప్లేయర్లకు కూడా నిధులు మంజూరు చేసింది. శుక్రవారం జరిగిన మిషన్ ఒలింపిక్స్ సెల్ సమావేశంలో పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే క్రమంలో పలు పోటీల్లో పాల్గొనాల్సిన జ్యోతి, శైలి పెట్టిన అర్జీలకు ఆమోదం లభించింది. జ్యోతి యూర్పలో ఆరు అంతర్జాతీయ పోటీల్లో తలపడాల్సి ఉంది. ఇందుకయ్యే ఖర్చులను భరించేందుకు ఎంఓసీ ముందుకొచ్చింది. ఇక, టార్గెట్ ఒలింపిక్స్ పోడియం (టాప్స్) స్కీమ్ కోర్ గ్రూప్లోకి కొత్తగా షట్లర్లు అశ్వినీ పొన్నప్ప, తనీషా, షూటర్ మహేశ్వరీ చౌహాన్, రోవర్ బాల్రాజ్ పన్వర్ను తీసుకున్నారు.
Updated Date - May 04 , 2024 | 05:26 AM