మహిత్, అభినవ్కు పతకాలు
ABN, Publish Date - Sep 06 , 2024 | 01:14 AM
ప్రపంచ బధిర షూటింగ్ చాంపియన్షి్పలో భారత షూటర్లు మహిత్ సంధు స్వర్ణం, అభినవ్ దేశ్వాల్ రజతం కొల్లగొట్టారు. గురువారం ముగిసిన ఐదో రోజు పోటీల్లోని మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఫైనల్లో...
హానోవర్ (జర్మనీ): ప్రపంచ బధిర షూటింగ్ చాంపియన్షి్పలో భారత షూటర్లు మహిత్ సంధు స్వర్ణం, అభినవ్ దేశ్వాల్ రజతం కొల్లగొట్టారు. గురువారం ముగిసిన ఐదో రోజు పోటీల్లోని మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఫైనల్లో మహిత్ 247.4 స్కోరుతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో మహిత్కు ఇది రెండో స్వర్ణం కాగా, మొత్తంగా మూడో పతకం. ఇంతకుముందు మహిత్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్లో ధనుష్ శ్రీకాంత్తో కలిసి స్వర్ణం, 10 మీ, ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రజతం సాధించింది. పురుషుల 25 మీ., పిస్టల్ విభాగంలో అభినవ్ దేశ్వాల్ ఒక్క పాయింట్ తేడాతో స్వర్ణం కోల్పోయి, రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇక, ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు 4 స్వర్ణాలు సహా 15 పతకాలు సాధించింది.
Updated Date - Sep 06 , 2024 | 01:14 AM