ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డిసెంబరులోపు కొత్త క్రీడా పాలసీ

ABN, Publish Date - Aug 22 , 2024 | 06:42 AM

: అటకెక్కిన రాష్ట్ర నూతన క్రీడా పాలసీ రూపకల్పన ప్రక్రియకు సుదీర్ఘకాలం తర్వాత చలనం వచ్చింది. ముసాయిదా క్రీడా పాలసీ రూపకల్పన కమిటీ చైర్మన్‌గా రాష్ట్ర క్రీడాశాఖ సలహాదారుడు ఏపీ జితేందర్‌ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. శాట్జ్‌ చైర్మన్‌

మాజీ ఎంపీ జితేందర్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు

30వ తేదీన తదుపరి భేటీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): అటకెక్కిన రాష్ట్ర నూతన క్రీడా పాలసీ రూపకల్పన ప్రక్రియకు సుదీర్ఘకాలం తర్వాత చలనం వచ్చింది. ముసాయిదా క్రీడా పాలసీ రూపకల్పన కమిటీ చైర్మన్‌గా రాష్ట్ర క్రీడాశాఖ సలహాదారుడు ఏపీ జితేందర్‌ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. శాట్జ్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి సహా 11 మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. జితేందర్‌ రెడ్డి ఆధ్యక్షతన ముసాయిదా క్రీడా పాలసీపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు క్రీడాశాఖ కార్యదర్శి వాణిప్రసాద్‌, శాట్జ్‌ వీసీ ఎండీ సోనీబాలాదేవి, ఒలింపిక్‌ సంఘం మాజీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వేణుగోపాలచారి, జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ గోపీచంద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా శివసేనా రెడ్డి మాట్లాడుతూ.. నూతన క్రీడా పాలసీలో క్రీడాకారుల సంక్షేమం, కొత్త కోచ్‌ల నియామకం, క్రీడారంగం అభివృద్ధికి దశాదిశను నిర్దేశించేలా రూపొందిస్తామన్నారు. డిసెంబరులోపు క్రీడా పాలసీ రూపకల్పన పూర్తి చేస్తామని, ఈనెల 30వ తేదీన మరోసారి క్రీడారంగ నిపుణులతో భేటీ కానున్నామని చెప్పారు. త్వరలో శాట్జ్‌ కొత్త లోగోను సీఎం రేవంత్‌ రెడ్డి ఆవిష్కరించనున్నారని శివసేనారెడ్డి తెలిపారు.

Updated Date - Aug 22 , 2024 | 06:42 AM

Advertising
Advertising
<