ఒలింపిక్ సంఘం ఎన్నికల బరిలో జితేందర్ రెడ్డి
ABN, Publish Date - May 30 , 2024 | 06:26 AM
తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నికల బరిలో మాజీ ఎంపీ, ప్రభుత్వ క్రీడాశాఖ సలహాదారుడు జితేందర్ రెడ్డి బరిలో నిలిచారు. బుధవారంతో నామినేషన్ల
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నికల బరిలో మాజీ ఎంపీ, ప్రభుత్వ క్రీడాశాఖ సలహాదారుడు జితేందర్ రెడ్డి బరిలో నిలిచారు. బుధవారంతో నామినేషన్ల గడువు ముగిసింది. అధ్యక్షుడి స్థానానికి జితేందర్ రెడ్డితో పాటు తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వర్నాథ్ నామినేషన్ దాఖలు చేశారు. చాముండేశ్వర్నాథ్ ఉపాధ్యక్ష స్థానానికి కూడా నామినేషన్ వేశారు ప్రధాన కార్యదర్శికి మల్లారెడ్డి, బాబురావు, ప్రదీప్ కుమార్ నామినేషన్లు వేశారు. వచ్చేనెల 9న ఎన్నికలు జరుగుతాయి. అదేరోజు ఫలితాలను ప్రకటించనున్నారు.
Updated Date - May 30 , 2024 | 06:26 AM