పృథ్వీ షాపై వేటు
ABN, Publish Date - Oct 23 , 2024 | 01:09 AM
టాపార్డర్ బ్యాటర్ పృథ్వీ షాకు షాక్ తగిలింది. త్రిపురతో శనివారం నుంచి జరిగే రంజీ మ్యాచ్ కోసం ఎంపిక చేసిన ముంబై జట్టులో షాకు చోటు దక్కలేదు. క్రమశిక్షణారాహిత్యంతోపాటు...
ముంబై రంజీ టీమ్ నుంచి అవుట్
ముంబై: టాపార్డర్ బ్యాటర్ పృథ్వీ షాకు షాక్ తగిలింది. త్రిపురతో శనివారం నుంచి జరిగే రంజీ మ్యాచ్ కోసం ఎంపిక చేసిన ముంబై జట్టులో షాకు చోటు దక్కలేదు. క్రమశిక్షణారాహిత్యంతోపాటు అధిక బరువు కారణంగానే అతడిని సెలెక్టర్లు తప్పించినట్టు తెలుస్తోంది. గత రెండు మ్యాచ్ల్లో కూడా షా పేలవ ప్రదర్శన చేశాడు. నెట్ ప్రాక్టీస్ విషయంలో అతడు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాడని ఎంసీఏ అధికారి తెలిపాడు. షా ఫీల్డింగ్ చూస్తే అతడి ఫిట్నెస్ ఏపాటిదో అర్థమవుతుందన్నాడు.
Updated Date - Oct 23 , 2024 | 01:09 AM