ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

క్వార్టర్స్‌కు సాత్విక్‌ జోడీ

ABN, Publish Date - Jul 30 , 2024 | 01:40 AM

బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో టాప్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి జంట క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. గ్రూప్‌-సిలో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి ఆడాల్సిన

బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో టాప్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి జంట క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. గ్రూప్‌-సిలో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి ఆడాల్సిన రెండో మ్యాచ్‌ రద్దయింది. జర్మనీ జంట లమ్స్‌ఫ్‌స-మార్విన్‌ సీడెల్‌తో సాత్విక్‌ తలపడాల్సి ఉంది. అయితే, లమ్స్‌ఫస్‌ గాయపడడంతో జర్మనీ జంట ఒలింపిక్స్‌నుంచి వైదొలిగింది. దీంతో పోటీలో మూడు జంటలు మాత్రమే నిలిచాయి. కానీ, ఫ్రాన్స్‌కు చెందిన లుకాస్‌ కోర్వి-రోనన్‌ లబార్‌ జోడీ తామాడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. ఈ నేపథ్యంలో ఒక్కో మ్యాచ్‌ నెగ్గిన సాత్విక్‌ జోడీ, ఇండోనేసియాకు చెందిన అర్డియాంటో-అల్ఫియాన్‌ జంటలు టాప్‌-2లో నిలిచి నాకౌట్‌ బెర్త్‌లను ఖరారు చేసుకొన్నాయి. మంగళవారం ఈ రెండు జోడీల మధ్య జరిగే మ్యాచ్‌తో గ్రూప్‌ విన్నర్‌ ఎవరనేది తేలుతుంది.

Updated Date - Jul 30 , 2024 | 01:40 AM

Advertising
Advertising
<