ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mansukh Mandaviya: 2030 యూత్ ఒలింపిక్స్ వేలానికి భారత్ సిద్ధం.. పోటీలో ఇంకా..

ABN, Publish Date - Sep 08 , 2024 | 05:26 PM

2030లో జరిగే యూత్ ఒలింపిక్స్‌ కోసం వేలం వేయడానికి భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఆదివారం తెలిపారు. 44వ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఈ మేరకు పేర్కొన్నారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇక్కడ చుద్దాం.

Mansukh Mandaviya

మరికొన్ని ఏళ్లలో ఇండియాలో ఒలంపిక్స్ జరగనున్నాయా. అంటే అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే 2030లో జరిగే యూత్ ఒలింపిక్స్‌కు(Youth Olympics) వేలం వేయడానికి భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా(Mansukh Mandaviya) ఆదివారం తెలిపారు. 2036లో జరిగే ఒలింపిక్ క్రీడల ఆతిథ్యానికి ఇది ఒక ముఖ్యమైన ముందడుగని తెలిపారు. ఒలంపిక్ కౌన్సిల్ 44వ సాధారణ సభ సందర్భంగా ఈ మేరకు వెల్లడించారు. ఈ క్రమంలో భారత్‌తో పాటు పెరూ, కొలంబియా, మెక్సికో, థాయిలాండ్, మంగోలియా, రష్యా, ఉక్రెయిన్, బోస్నియా, హెర్జెగోవినా కూడా యూత్ ఒలింపిక్స్ 2023కి ఆతిథ్యం ఇవ్వడానికి రేసులో ఉన్నాయన్నారు.


ఒలింపిక్ కౌన్సిల్

44వ ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ సమావేశంలో క్రీడా నిర్వాహకుడు రణధీర్ సింగ్ తొలి OCA అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆసియా క్రీడల్లో ఇప్పటికే యోగా చేర్చినట్లు గుర్తు చేశారు. 2026లో జపాన్‌లో జరగనున్న ఆసియా క్రీడల్లో యోగా చేర్చబడినట్లు వెల్లడించారు. ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ కొత్త అధ్యక్షుడు ఈ విషయాన్ని ప్రకటించారు. దీనికి అన్ని దేశాలు అంగీకరించాయన్నారు. పంజాబ్‌లోని పాటియాలాకు చెందిన 77 ఏళ్ల రణధీర్ ఆసియా క్రీడల్లో మూడు పతకాలు సాధించారు. ఆయన నేతృత్వంలో చాలా మంది ఆటగాళ్ళు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. రణధీర్ మామ మహారాజా యద్వీందర్ సింగ్ భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడారు, IOC సభ్యుడిగా ఉన్నారు. ఆయన తండ్రి భలీంద్ర సింగ్ కూడా ఫస్ట్-క్లాస్ క్రికెటర్, 1947, 1992 మధ్య IOC సభ్యుడిగా ఉన్నారు.


గతంలో

నాలుగు ఆసియా క్రీడల్లో పాల్గొన్న రణధీర్ 1978లో ట్రాప్ షూటింగ్‌లో స్వర్ణం, 1982లో కాంస్యం, 1986లో రజతం సాధించారు. ఆయన 1978లో కెనడాలోని ఎడ్మోంటన్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా పాల్గొన్నారు. స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న రణధీర్ 1987లో స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్‌లోకి ప్రవేశించారు. ఆయన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) సెక్రటరీ జనరల్‌గా నియమించబడ్డారు. ఆ క్రమంలో 2012 వరకు ఈ పదవిలో ఉన్నారు. ఆ తర్వాత 1987లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో సభ్యునిగా నియమించబడ్డారు. 2010 వరకు ఈ పదవిలో కొనసాగారు. రణధీర్ 2010 ఢిల్లీ కామన్వెల్త్ క్రీడలకు ఆర్గనైజింగ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. రణధీర్ 1991లో ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) సెక్రటరీ జనరల్‌గా నియమితులయ్యారు. 2015 వరకు ఈ పదవిలో కొనసాగారు.


గర్వంగా

భారతదేశం ఎల్లప్పుడూ ఒలింపిక్ క్రీడాస్ఫూర్తిని గౌరవిస్తుందని భారత ఒలింపిక్‌ సంఘం (IOA) అధ్యక్షురాలు డాక్టర్‌ పీటీ ఉష అన్నారు. ఈ క్రమంలో 44వ ఒలింపిక్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆసియా జనరల్‌ అసెంబ్లీకి కన్వీనర్‌గా మీ ముందు నిలవడం గొప్ప గౌరవమని అభిప్రాయం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ ఈ మహాసభకు ఆతిథ్యమివ్వడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి..

Mansukh Mandaviya: 2030 యూత్ ఒలింపిక్స్ వేలానికి భారత్ సిద్ధం.. పోటీలో ఇంకా..


IND vs BAN: భారత్, బంగ్లా టెస్ట్, T20 సిరీస్‌లు రద్దు అవుతాయా.. కొనసాగుతున్న బహిష్కరణ ట్రెండ్


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 08 , 2024 | 05:28 PM

Advertising
Advertising