ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వందనం.. అభివందనం

ABN, Publish Date - Jul 01 , 2024 | 06:00 AM

కప్‌ గెలిచిన భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన వారు టీమిండియా ప్రదర్శనను కొనియాడుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారు. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం స్వయంగా...

ఫోన్లో రోహిత్‌, కోహ్లీ, ద్రవిడ్‌తో మోదీ సంభాషణ

కప్‌ గెలిచిన భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన వారు టీమిండియా ప్రదర్శనను కొనియాడుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారు. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం స్వయంగా ఫోన్‌ చేసి భారత జట్టు సభ్యులతో విజయానందాన్ని పంచుకొన్నారు. రోహిత్‌ శర్మ కెప్టెన్సీతోపాటు అతడి అద్భుత కెరీర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా ఫైనల్‌ మ్యాచ్‌లో కోహ్లీ ఆడిన తీరును కొనియాడారు. ఆఖరి ఓవర్‌ వేసిన హార్దిక్‌ పాండ్యాను, అద్భుత క్యాచ్‌ అందుకున్న సూర్యకుమార్‌ను, ఆపద్బాంధవుడిగా జట్టును ఆదుకొన్న బుమ్రాను మోదీ అభినందించారు. టీమిండియాకు ఎనలేని సేవలందించిన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘భారత జట్టుతో మాట్లాడి వారి స్ఫూర్తిదాయక విజయాన్ని అభినందించా. టోర్నీ అంతటా అద్భుత ప్రదర్శన కనబర్చారు. జట్టులోని ప్రతి ఆటగాడి నిబద్ధత ప్రేరణ కలిగించింద’ని ఎక్స్‌లో మోదీ పోస్టు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jul 01 , 2024 | 06:00 AM

Advertising
Advertising