ఎప్సెట్కు 3,42,958 దరఖాస్తులు!
ABN, Publish Date - Apr 07 , 2024 | 03:09 AM
ఇంజనీరింగ్, అగ్రికల్చర్ , ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్సెట్కు 3,42,958 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 2,46,862 మంది
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్, అగ్రికల్చర్ , ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్సెట్కు 3,42,958 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 2,46,862 మంది ఇంజనీరింగ్కు, 95,783 మంది అగ్రికల్చర్, ఫార్మసీ, 313 మంది రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నట్లు ఎప్సెట్ అధికారులు ప్రకటించారు. ఎటువంటి ఆలస్య రుసుం లేకుండా శనివారంతో దరఖాస్తు గడువు ముగిసింది. గతేడాది (ఎంసెట్కు) మొత్తం 3,20,683 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఈసారి 22,275 దరఖాస్తులు ఎక్కువ వచ్చాయి. ఇక ఈసారి ఆంధ్రప్రదేశ్కు చెందిన 61,877 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
Updated Date - Apr 07 , 2024 | 03:09 AM