పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి
ABN, Publish Date - May 19 , 2024 | 10:37 PM
జిల్లా కేం ద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో ఆదివా రం కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యు డు గోమాస ప్రకాష్ సుందరయ్య చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మంచిర్యాల కలెక్టరేట్, మే 19: జిల్లా కేం ద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో ఆదివా రం కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యు డు గోమాస ప్రకాష్ సుందరయ్య చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితుడై పార ్లమెంట్లో ప్రతిపక్ష నేతగా, ఎమ్మెల్యేగా సేవ లందించారని పేర్కొన్నారు. నాయకులు ప్రభా కర్, కుమారస్వామి, మోహన్, రాజ్కుమార్, రాములు, రాజు, రాందాస్ పాల్గొన్నారు.
కాసిపేట: సోమగూడెం మైదానంలో పుచ్చలపల్లి సుం దరయ్య వర్ధంతిని సీపీఎం నాయకులు నిర్వహించారు. సుందరయ్య చిత్రపటానికి సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిద్దయ్య, శ్రీనివాస్, పోశం, శ్రీనివాస్, సదానందం, రాజలింగు, కౌశిక్, శ్రీనివాస్, ప్రేంకుమార్ పాల్గొన్నారు.
చెన్నూరు: చెన్నూరు పట్టణంలోని తాపీ మేస్ర్తీ సంఘం భవనంలో సుందరయ్య వర్ధంతిని సీపీఎం నాయకులు నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పైళ్ల ఆశయ్య సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పద్మ, నగేష్, ఉమారాణి, సమ్మక్క, రాజేశ్వరి, చంద్రన్న, మారన్న, రేణుక పాల్గొన్నారు.
దండేపల్లి: కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి దండేపల్లిలో సీపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు దుంపల రంజిత్కుమార్ మాట్లాడుతూ ఆయన ఆశయ సాధన కోసం అందరం కృషి చేయాలన్నారు. లచ్చగౌడ్, రాజలింగు, రమేష్, ఎల్ల య్య, మహేశ్వరీ, శ్యామల, తారబాయ్, వెంకటేష్, సునీత, సుజాత, బాపు, గంగామణి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 19 , 2024 | 10:37 PM