ముగిసిన రాష్ట్రస్థాయి సాంస్కృతిక పోటీలు
ABN, Publish Date - Jun 11 , 2024 | 10:11 PM
జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్లో జిల్లా నృత్య కళా సమాఖ్య ఆధ్వ ర్యంలో సోమవారం నుంచి నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సాంస్కృతిక పోటీలు మంగళ వారం ముగిశాయి.
ఏసీసీ, జూన్ 11: జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్లో జిల్లా నృత్య కళా సమాఖ్య ఆధ్వ ర్యంలో సోమవారం నుంచి నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సాంస్కృతిక పోటీలు మంగళ వారం ముగిశాయి. కార్యక్రమానికి అతిథిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారా యణ, మున్నూరు కాపు సంఘం నాయ కులు లక్ష్మణ్ పటేల్, టీపీసీసీ సభ్యుడు చిలు వేరు శంకర్లు హాజరై విజేతలకు బహుమ తులు అందించారు. పోటీల్లో శాస్ర్తీయ నృత్యం సీనియర్ విభాగంలో వెన్నెల లాస్య గ్రూపు మొదటి స్ధానంలో నిలువగా, శ్రీనిధి నృత్యాలయం గ్రూపు రెండో స్ధానంలో నిలి చింది. జానపద విభాగంలో ప్రశాంత్ గ్రూపు మొదటి స్ధానంలో నిలువగా వర్షిని గ్రూపు రెండో స్ధానంలో నిలిచింది. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వంగళ శ్రీధర్ మాస్టర్, డాక్టర్ రంగ జ్యోతిలు వ్యవహరించారు. కిషన్, రవీందర్, సంతోష్, మదుకర్, డ్యాన్సమాస్టర్ లక్ష్మణ్, అర్జున్ పాల్గొన్నారు.
Updated Date - Jun 11 , 2024 | 10:11 PM