బకాయి వేతనాలు ఇవ్వాలి
ABN, Publish Date - Apr 05 , 2024 | 11:43 PM
బకాయి ఉన్న వేతనాలు విడుదల చేయాలని గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల సంఘం రా ష్ట్ర అధ్యక్షుడు యజ్ఞ నారాయణ డిమాండ్ చేశారు.
బకాయి వేతనాలు ఇవ్వాలి
విధులు బహిష్కరించి ధర్నా చేపట్టిన గ్రామపంచాయతీ కార్మికులు
కొండమల్లేపల్లి, ఏప్రిల్ 5: బకాయి ఉన్న వేతనాలు విడుదల చేయాలని గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల సంఘం రా ష్ట్ర అధ్యక్షుడు యజ్ఞ నారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం కొండమల్ల్లేపల్లి గ్రామపంచాయతీ కార్మికులు వి ధులు బహిష్కరించి స్థానిక చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భం గా నారాయణ మాట్లాడుతూ నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోడంతో కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అ న్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలను పోషించుకుంటున్న కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. వెంటనే బకాయి వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు కో ట్ల సతీష్, వెంకటయ్య, అలివేలు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 05 , 2024 | 11:43 PM