మార్కెట్లోకి క్లియర్ ప్రీమియం వాటర్
ABN, Publish Date - Jul 26 , 2024 | 11:55 PM
ప్యాకేజ్డ్ వాటర్ సెగ్మెంట్లో అగ్రగామిగా ఉన్న క్లియర్ ప్రీమియం వాటర్ హైదరాబాద్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. అహ్మదాబాద్కు చెందిన ఈ సంస్థ మిగిలిన నీటి సంస్థలతో పోలిస్తే కనీసం ఐదు కీలక భేదాలను కలిగి ఉంటుంది.
హైదరాబాద్, జూలై 26: ప్యాకేజ్డ్ వాటర్ సెగ్మెంట్లో అగ్రగామిగా ఉన్న క్లియర్ ప్రీమియం వాటర్ హైదరాబాద్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. అహ్మదాబాద్కు చెందిన ఈ సంస్థ మిగిలిన నీటి సంస్థలతో పోలిస్తే కనీసం ఐదు కీలక భేదాలను కలిగి ఉంటుంది.
ఈ సందర్భంగా క్లియర్ ప్రీమియం వాటర్ వ్యవస్థాపక సీఈఓ నయన్ షా మాట్లాడుతూ.. “నాణ్యమైన స్వచ్చమైన నీటిని అందించాలనే ఉద్దేశంతో మార్కెట్లోకి ఈ నీటిని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇందుకోసం వినియోగదారులకు అవగాహన కల్పించడం ముఖ్యమైనదిగా భావిస్తున్నామన్నారు. మా వినియోగదారులకు అవసరమైన మొత్తం సమాచారాన్ని ముందస్తుగా అందిస్తున్నామన్నారు. పారదర్శకంగా ఉండటంతోపాటు నాణ్యతకు పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. స్వచ్ఛమైన, సురక్షితమైన త్రాగునీటిని అందించాలనే దృక్పథంతో ఈ సంస్థను స్థాపించినట్లుగా ఆయన తెలిపారు. భారతదేశం అంతటా ఇప్పటికే తాము విస్తరించామని, కంపెనీ 1,600 కంటే ఎక్కువ HoReCa (హోటల్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్) వినియోగదారులను కలిగి ఉండటమే కాకుండా అగ్ర జాతీయ విమానయాన సంస్థలకు సేవలు అందిస్తోందన్నారు. క్లియర్ ప్రీమియం వాటర్ యొక్క ప్రతి బాటిల్ దాని చదరపు ఆకారపు ప్రీమియం ప్యాకేజింగ్, నిలువు లేబులింగ్తో ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. భారతీయ ప్రమాణాల సంస్థ, సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలను పాటిస్తున్నామన్నారు.
Updated Date - Jul 27 , 2024 | 12:04 AM