నేడు డిగ్రీ షెడ్యూల్ విడుదల!
ABN, Publish Date - May 03 , 2024 | 04:38 AM
రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు శుక్రవారం విడుదల చేయనున్నారు.
హైదరాబాద్, మే 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు శుక్రవారం విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్లను దోస్త్ ద్వారా భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. దోస్త్లో దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్ మార్కుల ఆధారం కళాశాలల్లో సీట్లను కేటాయిస్తారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల రుసుము చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. అయితే అభ్యర్థుల అభ్యర్థన మేరకు పరీక్ష ఫీజు చెల్లింపుకు మే 4వ అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
టెట్ సమస్యకు త్వరలోనే పరిష్కారం
ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియకు అడ్డంకిగా మారిన టెట్ అర్హత సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బిరెల్లి కమలాకర్రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి తెలిపారు.
Updated Date - May 03 , 2024 | 08:34 AM