ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కాంగ్రెస్‌ మోసపు మాటలు నమ్మొద్దు

ABN, Publish Date - May 08 , 2024 | 11:18 PM

కరోనా సమయంలో ప్రజలకు వానుంచి కాపాడిన నరేంద్ర మోదీని మూడోసారి ప్రధాన మంత్రిగా ఆదరించాలని కర్ణాటక రాష్ట్రం కోలార్‌ నియోజకవర్గం బీజేపీ ఎంపీ మునిస్వామి పిలుపునిచ్చారు.

పాలమూరులో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎంపీ మునిస్వామి

- కర్ణాటక రాష్ట్రం కోలార్‌ నియోజకవర్గ బీజేపీ ఎంపీ మునిస్వామి

మహబూబ్‌నగర్‌ (క్లాక్‌టవర్‌), మే 8 : కరోనా సమయంలో ప్రజలకు వానుంచి కాపాడిన నరేంద్ర మోదీని మూడోసారి ప్రధాన మంత్రిగా ఆదరించాలని కర్ణాటక రాష్ట్రం కోలార్‌ నియోజకవర్గం బీజేపీ ఎంపీ మునిస్వామి పిలుపునిచ్చారు. ఆయన బుధవారం బీజేపీ అభ్యర్థి డీకే అరుణ తరఫున పట్టణంలోని 47వ వార్డు కొత్త గంజి, సంజయ్‌ నగర్‌ వంటి తదితర ప్రాంతాలలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కరోనా కాలంలో ఒకరికి ఒకరం పలకరించుకునేందుకు భయపడే వాళ్లమని, ఆ సమయంలో నరేంద్రమోదీ దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చి ప్రాణాలు కాపాడారని అన్నారు. కాంగ్రెస్‌ చెపుతున్న మోసపూరిత మాటలను నమ్మవద్దని అన్నారు. ఆడ బిడ్డ అని చూడకుండా అసభ్యకరంగా మాట్లాడడం సీఎంగా రేవంత్‌రెడ్డికి తగదని అన్నారు. కాంగ్రెసోళ్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా నోటికి వచ్చినట్లు హిందుత్వంపై మాట్లాడుతున్న మాటలను ప్రజలు, మేధావులు, విద్యావంతులు గమనించాలని విజ్ఞప్తి చేశారు. కమలం పువ్వుకు ఓట్లేసి డీకే అరుణను గెలిపించాలని ఆయన ఇంటింటి ప్రచారంలో ప్రజలను కోరారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కిష్ట్యానాయక్‌, మాజీ మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ కుర్వ రాములు, శక్తి కేంద్రం ఇన్‌చార్జి హరికృష్ణ ఉన్నారు.

Updated Date - May 08 , 2024 | 11:18 PM

Advertising
Advertising