వైభవంగా సత్యనారాయణస్వామి కల్యాణం
ABN, Publish Date - Jun 03 , 2024 | 12:33 AM
జిల్లా కేంద్రంలోని తు లసీనగర్ శ్రీ భక్తాంజనేయస్వామి దేవాలయంలో ఆదివారం శ్రీ రమా సత్యనారాయణస్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు.
వైభవంగా సత్యనారాయణస్వామి కల్యాణం
నల్లగొండ కల్చరల్, జూ న 2: జిల్లా కేంద్రంలోని తు లసీనగర్ శ్రీ భక్తాంజనేయస్వామి దేవాలయంలో ఆదివారం శ్రీ రమా సత్యనారాయణస్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. అర్చకస్వాములు శివప్రసాద్శర్మ, హరిశర్మ, అనంతరామశర్మ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణతో స్వామివారి కల్యాణాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కల్యాణ వేదికపైన స్వామి అమ్మవార్లను ఆశీనులను చేసి వేద పండితులు కల్యాణతంతును నడిపించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణాన్ని కనులారా తిలకించి పరవశులయ్యారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీహనుమాన జయంతి, ఆలయ వార్షికోత్సవం సందర్భంగా సత్యనారాయణస్వామిని ప్రతిష్ఠించిన రోజు కావడంతో కల్యాణాన్ని నిర్వహించారు. మూడు రోజుల పాటు ఆలయంలో వార్షిక బ్రహోత్సవాలను కన్నుల పండువగా నిర్వహించారు. కల్యాణం అనంతరం భక్తులందరికీ అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం లో ఆలయ ఈవో కుశలయ్య, జి.శేఖర్, భాస్కర్, గండా రమేష్, బిట్ల సుధాకర్రెడ్డి, పరమేష్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Updated Date - Jun 03 , 2024 | 12:33 AM