బండి సంజయ్... దీక్ష మోదీ వద్ద చేయి: పొన్నం
ABN, Publish Date - Apr 03 , 2024 | 02:50 AM
ఏనాడూ ప్రజాసమస్యలు పట్టించుకోని కాబోయే మాజీ ఎంపీ బండి సంజయ్కి రైతులు ఇప్పుడు గుర్తొచ్చారా..? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఆయన దీక్ష ఇక్కడ చేసే బదులు... ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ
హుస్నాబాద్, ఏప్రిల్ 2: ఏనాడూ ప్రజాసమస్యలు పట్టించుకోని కాబోయే మాజీ ఎంపీ బండి సంజయ్కి రైతులు ఇప్పుడు గుర్తొచ్చారా..? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఆయన దీక్ష ఇక్కడ చేసే బదులు... ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ వద్ద దీక్ష చేయాలని సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆయన సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేడ్కర్ చౌరస్తాలో పాపన్న విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వర్షాకాలంలో వానలు కురియక నీటి ఎద్దడి నెలకొందన్నారు. అయినా కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందని కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు పొలాల బాట పట్టారని, ఈ నాలుగు నెలలు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు.
Updated Date - Apr 03 , 2024 | 02:50 AM