ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: బస్టాండ్లు, రైల్వేస్టేషన్‌ నిండా జనాలే.. సంక్రాంతికి సొంతూళ్లకు పయనం

ABN, Publish Date - Jan 13 , 2024 | 10:06 AM

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ వైపు వెళ్లే రైళ్లలో భారీ రద్దీ కనిపిస్తోంది. సికింద్రాబాద్‌ నుంచి కాకినాడ, విశాఖపట్నం, ఇంటర్‌సిటీ, వంటి ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రయాణికులు మూడు నెలల ముందుగానే టికెట్‌ రిజర్వేషన్లు చేయించుకున్నారు.

- ఏపీ, తెలంగాణ జిల్లాలకు 1,250 ప్రత్యేక బస్సులు

- నేడు మరింత రద్దీ పెరిగే అవకాశం

- ఉచిత ప్రయాణంతో జిల్లా బస్సుల్లో మహిళల పోటీ

సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికులతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. బస్టాండ్లు రద్దీగా మారుతున్నాయి. సీట్ల కోసం ప్రయాణికులు ఫీట్లు చేస్తున్నారు. రన్నింగ్‌లో కూడా ఎక్కేందుకు పోటీ పడుతున్నారు.

హైదరాబాద్‌ సిటీ/సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ వైపు వెళ్లే రైళ్లలో భారీ రద్దీ కనిపిస్తోంది. సికింద్రాబాద్‌ నుంచి కాకినాడ, విశాఖపట్నం, ఇంటర్‌సిటీ, వంటి ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రయాణికులు మూడు నెలల ముందుగానే టికెట్‌ రిజర్వేషన్లు చేయించుకున్నారు. వాటిల్లోకి సాధారణ ప్రయాణికులు ఎక్కేస్తుండడంతో రిజర్వేషన్‌ తీసుకున్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రయాణికులతో బస్టాండ్లు కిటకిట

మహాత్మాగాంధీ, జూబ్లీ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సాధారణ రోజుల్లో బస్సుల్లో 1.6 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తే రెండు రోజులుగా రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులు జిల్లాలకు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీ, తెలంగాణ జిల్లాలకు రెగ్యులర్‌ సర్వీసులతో పాటు గురువారం రాత్రి 8 గంటల వరకు 975 ప్రత్యేక బస్సులు నడిపినట్లు రంగారెడ్డి ఆర్‌ఎం శ్రీధర్‌ తెలిపారు. రాత్రి 12 గంటల వరకు 1250 బస్సులు జిల్లాలకు వెళ్లే అవకాశముందన్నారు. శనివారం రద్దీ మరింత పెరిగితే బస్సుల సంఖ్య పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జిల్లాలకు వెళ్లే పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆయా బస్సుల్లో ప్రయాణానికి పోటీ పడుతున్నారు.

శివారు ప్రాంతాల నుంచే..

శివారు ప్రాంతాల నుంచే పలు జిల్లాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌ ప్రాంతాల్లో ప్రయాణికులు రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. పలు ప్రాంతాల్లో ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేసి ఆర్టీసీ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. ఆర్టీసీ బస్సులు రద్దీగా మారడంతో ప్రైవేట్‌ బస్సుల్లో రెట్టింపు చార్జీలు చెల్లించి సొంతూళ్లకు వెళ్లేందుకు నగరవాసులు క్యూ కట్టారు. ఏపీ, తెలంగాణ జిల్లాలకు వెళ్లే బస్సులతో మియాపూర్‌, కూకట్‌పల్లి, అమీర్‌పేట ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌జాం సమస్యలు నెలకొన్నాయి.

Updated Date - Jan 13 , 2024 | 10:06 AM

Advertising
Advertising