మద్దెల చెరువు సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్ హైకోర్టులో పిటిషన్..
ABN, Publish Date - Jan 11 , 2024 | 12:44 PM
మద్దెల చెరువు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇప్పటికే భాను కిరణ్కి యావజ్జీవ కారాగార శిక్షను నాంపల్లి కోర్టు విధించింది. నాంపల్లి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో భాను కిరణ్ పిటిషన్ వేశారు.
హైదరాబాద్: మద్దెల చెరువు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇప్పటికే భాను కిరణ్కి యావజ్జీవ కారాగార శిక్షను నాంపల్లి కోర్టు విధించింది. నాంపల్లి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో భాను కిరణ్ పిటిషన్ వేశారు. తనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయాలని భాను కిరణ్ కోరారు. 2011 సంవత్సరంలో జరిగిన మద్దెల చెరువు సూరి హత్య కేసులో భాను కిరణ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. 2018 డిసెంబర్లో ఆయనకు నాంపల్లి కోర్టు శిక్ష ఖరారు చేసింది. 12 ఏళ్లుగా జైల్లో ఉన్నందున తనకు బెయిల్ మంజూరు చేయాలని భాను కిరణ్ హైకోర్టును ఆశ్రయించారు. భాను కిరణ్ బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.
Updated Date - Jan 11 , 2024 | 12:44 PM