ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth: అక్రమ నిర్మాణాలను వదిలేది లేదు.. సీఎం రేవంత్‌ మాస్ వార్నింగ్

ABN, Publish Date - Aug 25 , 2024 | 01:17 PM

హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అస్సెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) కబ్జాదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మాణాలు చేసిన, చేస్తున్న వారిని గడగడలాడిస్తోంది.

హైదరాబాద్‌: హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అస్సెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) కబ్జాదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మాణాలు చేసిన, చేస్తున్న వారిని గడగడలాడిస్తోంది. కేవలం 42 రోజుల్లో చిన్న, పెద్ద భవనాలన్నీ కలిపి దాదాపు 70కి పైగా అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


తాజాగా శనివారం ఖానామెట్‌(Khanamet) గ్రామ పరిధిలో ప్రముఖ సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్‌. కన్వెన్షన్‌(N. Convention)ను కూల్చివేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.


చెరువులను అక్రమించే వాళ్లను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. కబ్జాదారుల చెర నుంచి చెరువులను రక్షిస్తామని వెల్లడించారు. చెరువులను కబ్జా చేసే వారి భరతం పడతామని హెచ్చరించారు. ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే ప్రకృతి ప్రకోపిస్తుందని అన్నారు. చెన్నై, వయనాడ్‌లో ప్రకృతి కోపాన్ని చూశామని గుర్తుచేశారు. భవిష్యత్‌ తరాలకు మనం ప్రకృతి సంపదను అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Aug 25 , 2024 | 01:27 PM

Advertising
Advertising
<