వంతెనను ప్రారంభించాలని బీజేపీ నాయకుల ధర్నా
ABN, Publish Date - Jul 26 , 2024 | 12:27 AM
రామడుగు వెళ్లే దారిలో నిర్మించిన నూతన వంతెనను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు గురు వారం ధర్నా నిర్వహించారు.
రామడుగు, జూలై 25: రామడుగు వెళ్లే దారిలో నిర్మించిన నూతన వంతెనను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు గురు వారం ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ ఏడు కోట్ల రూపాయల తో నిర్మించిన వంతెనను ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉపయోగిస్తు న్న వంతెన శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలిపో తుందో తెలియని పరిస్థితిలో ఉందన్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ధర్నాను విరమిం చాలని బీజేపీ నాయకులను కోరారు. వారు వినకపోవడంతో బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, పొన్నం శ్రీనివాస్గౌడ్, బండ తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీ మోడీ రవీందర్, పోచంపల్లి నరేష్, పురెళ్ల శ్రీకాంత్గౌడ్ పాల్గొన్నారు.
Updated Date - Jul 26 , 2024 | 12:27 AM