ఓసీపీ-3ని సందర్శించిన కోల్ సెక్రెటరీ
ABN, Publish Date - Mar 18 , 2024 | 12:04 AM
రామగుండం ఏరియా-2 పరిధి లోని ఓసీపీ-3 ప్రాజెక్టు సీహెచ్పీని ఆదివారం కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి విస్మితాతేజ్ సింగరేణి సీఎండీ బలరాంతో కలిసి సందర్శించారు.
యైుటింక్లయిన్కాలనీ, మార్చి 17: రామగుండం ఏరియా-2 పరిధి లోని ఓసీపీ-3 ప్రాజెక్టు సీహెచ్పీని ఆదివారం కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి విస్మితాతేజ్ సింగరేణి సీఎండీ బలరాంతో కలిసి సందర్శించారు. సీహెచ్పీ నుండి బొగ్గు రవాణా జరుగుతున్న ఫ్రీ వెబిన్ వ్యాగన్ లోడింగ్ సిస్టంను పరిశీలించారు. రోజుకు ఎన్ని ర్యాక్ల బొగ్గు రవాణా జరుగుతున్నది, త్వరితగతిన బొగ్గు రవాణా, వేమెంట్ విధానాన్ని స్థానిక అధికారులను అడిగి వివరాలు తెలుసు కున్నారు. వేసవిలో బొగ్గు అవసరాల దష్ట్యా బొగ్గు ఉత్పత్తి మరియు రవాణాకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా చూడాల విస్మితాతేజ్ సూచించారు. వారి వెంట సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్, పా) ఎన్వీకే శ్రీనివాస్, ఆర్జీ-2 జీఎం సూర్యనారాయణ, ఆర్జీ-1 జీఎం చింతల శ్రీని వాస్, ఏరియా ఇంజనీర్ నరసింహారావు, సీహెచ్పీ ఇంచార్జి సదానం దం, ఆర్జీ-1,2 సీనియర్ సెక్యూరిటీ అధికారులు వీరారెడ్డి, మహమ్మద్ షరీఫ్ తదితరులు ఉన్నారు.
Updated Date - Mar 18 , 2024 | 12:04 AM