ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సుల్తానాబాద్‌ పట్టణ సమగ్ర అభివృద్ధికి కృషి

ABN, Publish Date - Jun 24 , 2024 | 12:37 AM

సుల్తానాబాద్‌ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపు తున్నామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు.

సుల్తానాబాద్‌, జూన్‌ 23: సుల్తానాబాద్‌ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపు తున్నామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్‌ రిక్రియేషన్‌ క్లబ్‌ లో ఆదివారం జనరల్‌ బాడీ సమావేశాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యే క సమావేశంలో ఎమ్మెల్యేను క్లబ్‌ ఉపాధ్యక్షులు సీనియర్‌ న్యాయవాది క్రిష్ణమూర్తి, ప్రధానకార్యదర్శి ఆకుల రామేశ్వర్‌రెడ్డి, పలువురు ప్రతినిదులు ఆయనను సన్మానిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుల్తానాబాద్‌లో చదువుకున్న తాను ఈప్రాంత అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతానని అన్నారు. గత పాలకుల హయాంలో సుల్తానాబాద్‌ పట్ల సవతి తల్లి ప్రేమ చూపారన్నారు. గతంలో సుల్తా నాబాద్‌ తాలూకా కేంద్రంగా ఉండేదని, నియోజకవర్గంలో సుల్తానాబాద్‌ ప్రాంతాని కి ప్రత్యేక గుర్తింపు ఉందని, ప్రజల సహాకారం, మేదావుల ప్రోత్సాహంతో పట్టణా న్ని సమగ్రంగా అభివృద్ది చేయడానికి కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా సుల్తానాబాద్‌ పట్టణం వ్యాపార, వ్యవసాయపరంగా అభివృద్ధి చెందుతోందని, పెరుగుతున్న జనా భాకు తగ్గట్లుగా పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఇందులో భాగంగా ప్రధాన రోడ్లను వెడల్పు చేసే కార్యక్రమం కొనసాగుతుందని, దీనివల్ల పట్టణం బాగుంటుందన్నారు. అలాగే రిక్రియేషన్‌ క్లబ్‌ అభివృద్ధికి కూడా సహకరి స్తానన్నారు. కార్యక్రమంలో మినుపాల ప్రకాష్‌రావు, అంతటి అన్నయ్యగౌడ్‌, దామో దర్‌రావు, జగన్‌, రాజేంద్ర ప్రసాద్‌, ముస్తాల రవీందర్‌, ఖాలిక్‌, రమేష్‌, సురేష్‌, సాయిరి మహేందర్‌, కడారి అశోక్‌రావు, కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2024 | 12:37 AM

Advertising
Advertising